News September 25, 2025
నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. కర్నూలు మండలం పసుపుల సమీపంలో నీటి కుంటలో పడి సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి శ్రీనివాసులు(17) మృతి చెందాడు. కళాశాలకు వెళ్లి ఇంటికి చేరకుండా నీటి కుంటలో శవమై తేలాడు. విద్యార్థి మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు తాలూకా పోలీసులు నలుగురు విద్యార్థులను విచారిస్తున్నారు.
Similar News
News September 25, 2025
డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు: జేసీ

జిల్లాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జేసీ బి.నవ్య తెలిపారు. కొత్తగా 4,056 మంది కార్డుదారులు చేరడంతో మొత్తం 6,68,944 డిజిటల్ రేషన్ కార్డులు ATM సైజు, ఫొటో, రేషన్ షాప్ వివరాలు, క్యూఆర్ కోడ్, E-KYC వివరాలతో ఉంటాయన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్ద పంపిణీ చేస్తారన్నారు. అక్టోబర్ 2 నుంచి రేషన్ షాప్ల ద్వారా పొందవచ్చు అన్నారు.
News September 25, 2025
క్విజ్ పోటీల్లో పాల్గొనండి: కలెక్టర్

జిల్లా యువజన సంక్షేమ శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(VBYLD) క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. ఈ క్విజ్లో 15-29 ఏళ్ల యువత ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. జాతీయ యువజన ఉత్సవం-2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 15 వరకు ఆన్లైన్లో జరుగుతాయన్నారు. తెలుగు సహా 12 భాషల్లో బహుళైచిక ప్రశ్నల రూపంలో నిర్వహించనున్నట్లు వివరించారు.
News September 25, 2025
పెండింగ్ కేసులు తగ్గించండి: ఎస్పీ

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనకు టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ కేసును 60 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేయాలన్నారు. వివిధ అంశాలపై చర్చించారు.