News April 5, 2024
HYD: ఒంటిపై బల్లి పడిందని వెళ్లి చనిపోయాడు..!

ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. మండల పరిధి మాసానిగూడ వాసి రాములు(35) వ్యవసాయం చేస్తుండేవాడు. కొన్ని రోజుల క్రితం అతడికి చికెన్ పాక్స్ (అమ్మోరు) వ్యాధి సోకడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడు. ఇవాళ మధ్యాహ్నం తనపై బల్లి పడిందని, స్నానం చేసి వస్తానని చెప్పి తన పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.
Similar News
News February 25, 2026
ఫిల్మ్నగర్: సినిమా అవకాశం పేరుతో అసభ్యంగా ప్రవర్తన

సినిమాల్లో అవకాశాలంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఏపీకి చెందిన ఓ యువతి సినిమా అవకాశాల కోసం నగరానికి రాగా, స్నేహితురాలి ద్వారా జీఎం రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. లుక్ టెస్ట్, స్కిన్ టెస్ట్ పేరుతో కార్యాలయానికి పిలిపించి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 25, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 200 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది.
News February 25, 2026
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 200 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 70,171 మంది రెండవ సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో మొత్తం 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది.


