News September 26, 2025

వైసీపీలో కాంగ్రెస్ కీలక నేతల చేరిక

image

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్, గొర్రెల పెంపకందారుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా మాజీ ఛైర్మన్ రాం పుల్లయ్య యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు నరసింహులు యాదవ్ తమ అనుచరగణంతో వైసీపీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుర్చుకున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి జగన్ సూచించారు. జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ఉన్నారు.

Similar News

News September 26, 2025

ఆటో డ్రైవర్ నిజాయితీకి సీఐ ఫిదా

image

నిజాయితీకి ప్రతీకగా ఆటో డ్రైవర్ రవికుమార్ నాయక్ నిలిచారు. గురువారం కర్నూలులోని మౌర్య ఇన్ దగ్గర ఆటో ఎక్కిన ప్యాసింజర్ తన ఐఫోన్ మర్చిపోయి వెళ్లిపోయారు. డ్రైవర్ నిజాయితీతో రూ.80,000 విలువైన ఐ ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. నిజాయితీకి మెచ్చిన నాలుగో పట్టణ సీఐ విక్రమసింహ శాలువా కప్పి రవికుమార్ నాయక్‌ను సన్మానించారు. పోలీసుల సమక్షంలో బాధితుడికి ఫోన్ అప్పగించారు.

News September 26, 2025

నిబంధనలు పాటించని 2 ఆసుపత్రులు సీజ్: కలెక్టర్

image

నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీసీ అండ్ పీఎన్డీటీ సమావేశం నిర్వహించారు. కర్నూలులోని నిబంధనలను పాటించని రక్ష హాస్పిటల్‌తో పాటు కోడుమూరులోని బాషా హాస్పిటల్‌ను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా వైద్యశాఖ అధికారి శాంతికళ తెలిపారు.

News September 25, 2025

డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు: జేసీ

image

జిల్లాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి చర్యలు చేపట్టినట్లు జేసీ బి.నవ్య తెలిపారు. కొత్తగా 4,056 మంది కార్డుదారులు చేరడంతో మొత్తం 6,68,944 డిజిటల్ రేషన్ కార్డులు ATM సైజు, ఫొటో, రేషన్ షాప్ వివరాలు, క్యూఆర్ కోడ్, E-KYC వివరాలతో ఉంటాయన్నారు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 1 వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్ద పంపిణీ చేస్తారన్నారు. అక్టోబర్ 2 నుంచి రేషన్ షాప్‌ల ద్వారా పొందవచ్చు అన్నారు.