News September 26, 2025
పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పోలీసులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులే దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. వాళ్లు పోలీసులకే సహకారం అందిస్తున్నారని విమర్శించారు. పోలీసుల మీద పోలీసులే విచారిస్తే న్యాయం జరగదన్నారు.
Similar News
News September 26, 2025
28 నుంచి IIIT విద్యార్థులకు దసరా సెలవులు

ఇడుపులపాయలోని IIIT విద్యార్థులకు ఈనెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అన్ని క్యాంపస్ విద్యార్థులకు ఈ తేదీల్లోనే సెలవులు ఉంటాయి. స్వగ్రామాలకు వెళ్లడానికి విద్యార్థులు ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
News September 26, 2025
కడప మేయర్ తొలగింపు.. MLAకు నోటీసులు

కడప మేయర్ సురేశ్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్లారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్పై కౌంటర్ వేయాలని ప్రతివాదిగా ఉన్న MLA రెడ్డప్ప మాధవి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అలాగే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కడప కార్పొరేషన్ కమిషనర్, రీజినల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి నోటీసులు ఇచ్చింది. విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
News September 25, 2025
కడప: ‘జీఎస్టీ తగ్గింపుపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలి’

జీఎస్టీ పన్నుల తగ్గింపు గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ కార్యక్రమం గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 19 వరకు జీఎస్టీ గురించి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.