News September 26, 2025
గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలకు అనుమతి లేదు: SI అంకమ్మ రావు

ఉలవపాడు మండలం బద్దిపూడిలో గంగమ్మ తల్లి దసరా ఉత్సవాలపై ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెల 27 నుంచి జరిగే ఉత్సవాలకు అనుమతులు నిలిపివేసినట్లు SI అంకమ్మరావు గురువారం తెలిపారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత గ్రామ పెద్దలు, ప్రజల ఏకాభిప్రాయంతో ఉత్సవాలు నిర్వహించుకోవచ్చున్నారు. ప్రజలు శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News September 27, 2025
నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో..!

నెల్లూరు జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మైపాడు బీచ్, కోడూరు బీచ్, పాకల బీచ్, కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టు ఉన్నాయి. అలాగే నెల్లూరులోని రంగనాధస్వామి ఆలయం, జొన్నవాడ కామాక్షి, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, కసుమూరు, బారాషహీద్ దర్గాలు ఎంతో ప్రసిద్ధి. సోమశిల, కండలేరు డ్యామ్, ఉదయగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. మీ ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలను కామెంట్ చేయండి.
News September 27, 2025
నెల్లూరు: విధులకు రాకున్నా.. పక్కాగా జీతం !

గతంలో DMHO గా పనిచేసిన పెంచలయ్య హయాంలో కృష్ణాపురం PHC కి చెందిన ఓ వైద్యాధికారి 2022లో పీజీ కోర్సు చదివేందుకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన విధులకు హాజరువ్వకుండానే దాదాపు రెండేళ్లకు పైగా ప్రతీ నెల జీతం డ్రా చేసినట్లు సమాచారం. గత DMHO పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై విచారణ అధికారిని సైతం ప్రభుత్వం నియమిస్తూ జీవోను విడుదల చేయడం గమనర్హం. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
News September 27, 2025
నెల్లూరులో నకిలీ సైబర్ క్రైమ్ సీఐ అరెస్ట్

ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన నకిలీ క్రైమ్ బ్రాంచ్ సీఐ సాయికృష్ణతో పాటు అతని తండ్రి పోలయ్యను వేదయపాలెం పోలీసులు అరెస్టు చేశారు. శివాజీ నగర్లో నివాసముంటున్న సాయికృష్ణ విజయవాడ సైబర్ క్రైమ్లో సీఐ అంటూ పలువురిని నమ్మించాడు. న్యూ మిలిటరీ కాలనీకి చెందిన వినోద్ కుమార్ దగ్గర రూ.11లక్షలు తీసుకుని మోసం చేశాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు.