News September 26, 2025

శ్రీకాకుళం: రూ.15 వేల కోసం 10,728 దరఖాస్తులు

image

దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకాకుశం జిల్లా వ్యాప్తంగా 10, 981 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 10,728 మందికి ఈకేవైసీ పూర్తయిందని, 113 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అత్యధికంగా రణస్థలంలో 595, తక్కువగా ఎల్ఎన్ పేటలో 131 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కాగా ఈ నెల 22 తో గడువు ముగిసింది.

Similar News

News September 27, 2025

SKLM: లుక్ ఎట్ టుడే టాప్ న్యూస్

image

♦︎ పాతపట్నం: రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
♦︎ జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్
♦︎1998 డీఎస్సీ టీచర్ల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే కూన రవి
♦︎ సీఎంను కలిసిన ఎమ్మెల్యే గౌతు శిరీష
♦︎ శ్రీకాకుళంలో ముసురు వాతావరణం
♦︎ ఆధునిక సాంకేతికతో కొత్తమ్మతల్లి ఉత్సవాలు: SP
♦︎ టెక్కలి: చక్రం కదలదు.. వాహనం ముందుకెళ్లదు

News September 26, 2025

శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్

image

బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న రెండు గంటల్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్లు, శిథిల భవనాలు వద్ద ఉండరాదని, సురక్షితప్రాంతాల్లో ప్రజలు ఉండాలని సూచించింది.

News September 26, 2025

SKLM: ‘జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

image

ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మారిన జీఎస్టీపై ప్రభుత్వ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలసి ఆయన శుక్రవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. 4 వారాల షెడ్యూల్‌ను సవివరంగా ప్రజలకు తెలియజేయాలన్నారు.