News September 26, 2025

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

image

భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్టు 7 గేట్ల నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 6 గంటల వరకు వివరాలు..
* ఇన్ ఫ్లో: 2,41,873 క్యూసెక్కులు
* అవుట్ ఫ్లో: 1,94,044 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
* ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 882.20 అడుగులు
* నీటి నిల్వ: 200.1971 టీఎంసీలు

Similar News

News February 11, 2026

విద్యుత్ శాఖలో అతిత్వరలో నియామకాలు: గొట్టిపాటి

image

AP: విద్యుత్ ఉద్యోగుల‌పై ప‌ని ఒత్తిడిని త‌గ్గించేందుకు అతి త్వరలోనే నియామకాలు చేపడుతున్నట్లు మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఉద్యోగుల డిమాండ్ల‌లో 90 శాతానికి పైగా ప‌రిష్క‌రించామన్నారు. ప్ర‌జ‌ల్లో సంతృప్తి స్థాయులు పెరిగేలా విధులు నిర్వ‌ర్తించాలని బీసీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో తెలిపారు. మెడిక‌ల్ ఇన్సూరెన్స్ లిమిట్‌కు సంబంధించి స‌మ‌స్య‌లుంటే ప‌రిష్కారం దిశ‌గా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని చెప్పారు.

News February 11, 2026

ఏప్రిల్ నుంచి విశాఖ మెట్రో రైలు భూసేకరణ?

image

AP: విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్ట్ భూసేకరణ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మెట్రో మార్గంలో నష్టపోయే నివాస, వ్యాపార ఆస్తులను గుర్తించే సర్వే దాదాపుగా పూర్తయింది. ఈ రూట్‌కు 99.2 ఎకరాల భూమి అవసరం కాగా ఎక్కువభాగం ప్రభుత్వానికి(87 ఎకరాలు) చెందినదే ఉంది. రోడ్డుకు అనుసంధానంగా మెట్రో వెళ్లేలా DPR రూపొందించగా ఢిల్లీ, హైదరాబాద్ తరహా నిర్మాణ విధానం అనుసరించనున్నారు.

News February 11, 2026

‘మైసూర్ సోప్’ అంబాసిడర్‌గా తమన్నానే ఎందుకు?

image

తమన్నాను మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై కర్ణాటకలో <<19102536>>దుమారం<<>> రేగిన విషయం తెలిసిందే. అయితే నార్త్, సౌత్‌లో పాపులర్ ఫ్యాక్టర్, ప్రస్తుతం ఆమె ఎలాంటి బ్యూటీ సబ్బులను ప్రమోట్ చేయకపోవడం, SM ఫాలోవర్లు, పాన్ ఇండియా అప్పియరెన్స్, స్క్రీన్ ప్రెసెన్స్ అంశాలు కారణాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపిక కమిటీ చెబుతోంది. దీపిక, రష్మిక, కియారా, పూజా హెగ్డేను వెనక్కి నెట్టి తమన్నా ఈ ఆఫర్ కొట్టేశారు.