News September 26, 2025
కృష్ణా జిల్లాలో ఈ-క్రాప్ నమోదు నత్తనడక..!

కృష్ణా జిల్లాలో ఈ-క్రాప్ నమోదు గడువు (సెప్టెంబరు 15) ముగిసినా, జిల్లాలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. ఆర్ఎస్కే ఉద్యోగుల బదిలీల జాప్యం కారణంగా ప్రక్రియ నెమ్మదించింది. అధికారుల లెక్కల ప్రకారం కేవలం 67 శాతం మాత్రమే పూర్తయింది. దీంతో రైతులకు ప్రభుత్వ పథకాలు అందే విషయంలో ఆందోళన నెలకొంది.
Similar News
News September 27, 2025
కృష్ణాజిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. ఫేక్ జర్నలిస్టుల మోసాలకు చెక్

జర్నలిజం ముసుగులో సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఆటకట్టించేందుకు కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వారిచే జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్లు కలిగి ఉన్న జర్నలిస్టులకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఫేక్ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడే వారి ఆటకట్టించేందుకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
News September 27, 2025
మచిలీపట్నం: ‘సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి’

జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో సమావేశమై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో CM చర్చించిన అంశాలపై సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు.
News September 26, 2025
జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ డీకే బాలాజీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పన్ను తగ్గింపులు, వ్యాపారులకు కలిగే లాభాలు ఇంటింటికి చేరేలా చూడాలని ఆదేశించారు. మచిలీపట్నంలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు రూపకల్పన చేయాలని సూచించారు.