News September 26, 2025
పవన్ త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు

AP: వైరల్ ఫీవర్తో బాధపడుతున్న డిప్యూటీ సీఎం <<17834963>>పవన్<<>> కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చి ప్రజాసేవ కొనసాగించాలన్నారు. అలాగే ‘OG’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేయాలని Xలో పేర్కొన్నారు. అటు మంత్రి నారా లోకేశ్ సైతం పవన్ జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.
Similar News
News February 17, 2026
పాకిస్థాన్కు ‘రావి’ షాక్: ఏప్రిల్ నుంచి నీళ్లు బంద్!

వేసవి వేళ పాక్కు భారత్ షాకివ్వనుంది. రావి నదిపై నిర్మిస్తున్న షాపూర్ కండి బ్యారేజ్ మార్చి 31 నాటికి పూర్తి కానుంది. దీంతో ఏప్రిల్ నుంచి పాక్కు వెళ్లే మిగులు జలాలను పూర్తిగా నిలిపేయనున్నట్లు JK మంత్రి జావెద్ అహ్మద్ ప్రకటించారు. 1960 ఒప్పందం ప్రకారం ఈ నదిపై భారత్కే పూర్తి హక్కులు ఉన్నా ఇన్నాళ్లూ ప్రాజెక్టుల్లేక నీరు వృథాగా పాక్కు వెళ్లేది. ఇకపై ఆ నీటితో JK, పంజాబ్లకు సాగునీరు అందనుంది.
News February 17, 2026
రేపటి నుంచి శనగల కొనుగోళ్లు.. 15 రోజుల్లో డబ్బులు: మంత్రి

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి శనగల కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. CM APP ద్వారా షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు చేపడతామన్నారు. 15 రోజుల్లోపు అన్నదాతల అకౌంట్లకే డబ్బులు జమ చేస్తామని భరోసా ఇచ్చారు. కాగా 2026-27 రబీ సీజన్కు కేంద్రం క్వింటాకు రూ.5,875 మద్దతు ధర ప్రకటించిన విషయం తెలిసిందే.
News February 17, 2026
హీరో తండ్రి కన్నుమూత

బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 14న మరణించగా తాజాగా ఆ వార్త బయటకు వచ్చింది. ఢిల్లీలో కుటుంబసభ్యుల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. దీనికి సిద్ధార్థ్, ఆయన భార్య కియారా అద్వాణీ హాజరయ్యారు. సునీల్ గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్గా పని చేశారు.


