News September 26, 2025
భారత్ సీజ్ఫైర్లో ట్రంప్ కీలక పాత్ర: పాకిస్థాన్

IND-PAK మధ్య యుద్ధాన్ని ఆపానన్న US అధ్యక్షుడు ట్రంప్ వాదనకు పాక్ బలం చేకూరుస్తోంది. ట్రంప్తో PM షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇవాళ భేటీ అయిన సందర్భంగా ఈ ప్రకటన చేసింది. ‘ఈ భేటీలో ద్వైపాక్షిక భాగస్వామ్యం, గాజా-ఇజ్రాయెల్ యుద్ధం, ఉగ్రవాదంపై పోరు వంటి అంశాలు చర్చించారు. పాక్-భారత్ మధ్య సీజ్ఫైర్కు ట్రంప్ సాయం, పశ్చిమాసియాలో తిరిగి శాంతి నెలకొల్పేందుకు ఆయన కృషి చేశారు’ అని పొగడ్తలతో ముంచెత్తింది.
Similar News
News February 8, 2026
YS జగన్తో TVK విజయ్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, తమిళ సినీ హీరో, టీవీకే అధినేత విజయ్ చెన్నైలో జరిగిన వెడ్డింగ్ ఈవెంట్లో కలిశారు. జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి పెళ్లి వేడుకకు విజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ పక్కపక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
News February 8, 2026
ఏప్రిల్ తర్వాత రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: CM

TG: రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ తర్వాత ఇస్తామని CM రేవంత్ చెల్పూర్ సభలో ప్రకటించారు. గోదావరి సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేసే యోచన లేదన్నారు. సింగరేణి కార్మికులకు నష్టం చేకూర్చే ఏ పనిని ప్రభుత్వం చేపట్టదని స్పష్టం చేశారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతాలను, దేవాలయాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇందుకోసం రూ.3వేలకోట్లయినా ఖర్చు చేస్తామన్నారు.
News February 8, 2026
ఇంగ్లండ్పై పోరాడి ఓడిన నేపాల్

T20WC: ఇంగ్లండ్-నేపాల్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపేంద్ర సింగ్(44), కెప్టెన్ రోహిత్ పౌడెల్(39) పోరాటం వృథా అయ్యింది. కుశాల్(29), లోకేశ్(39) కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 2, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరన్, ఉడ్ తలో వికెట్ తీశారు.


