News September 27, 2025
శ్రీలలితా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ

దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వనున్నారు. మరోవైపు వరంగల్లోని భద్రకాళీ అమ్మవారు భువనేశ్వరీ అలంకారంలో భక్తులకు కనువిందు చేయనున్నారు. అటు శ్రీశైలం భ్రమరాంభిక దేవి కాత్యాయనీ అలంకారంలో కనిపించనున్నారు. ఇక తిరుమలలో ఉ.8-10 గంటల వరకు శ్రీవారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేటూన్యూస్లో లైవ్ చూడవచ్చు.
Similar News
News February 21, 2026
పనికిరాని వస్తువులకు నిత్యావసరాలు.. సీఎం ప్రకటన

AP: ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నట్లు CM చంద్రబాబు తెలిపారు. ‘‘ఇవి వారానికోసారి గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికిరాని వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. వచ్చేనెల కల్లా అన్ని పంచాయతీల్లో 100% ఇంటింటి నుంచి చెత్త సేకరిస్తాం. రాజమండ్రి, KNL, KDP, నెల్లూరులో రూ.1,254CRతో PPP విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15కల్లా వినియోగంలోకి తెస్తాం’’ అని తెలిపారు.
News February 21, 2026
VASTHU: ఏ అంతస్తులో ఎవరు ఉండాలి?

కుటుంబంలో ఆస్తి పంపకాల తగాదాలను నివారించడంలో వాస్తుశాస్త్రం కీలక పాత్ర పోషిస్తుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు వివరించారు. అంతస్తులు గల భవనాలను సోదరులు ఏవిధంగా పంచుకోవాలో సూచించారు. ‘పై అంతస్తులో చిన్నవారు ఉండాలి. కింద పెద్దవారు నివసించాలి. సభ్యుల సంఖ్యను బట్టి ఈ క్రమాన్నే పాటించాలి. తద్వారా సోదరుల మధ్య ఐక్యత పెరుగుతుంది. మనస్పర్థలు రావు. కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 21, 2026
రాష్ట్రంలో 250 పోస్టులకు నోటిఫికేషన్

<


