News April 6, 2024
జరిమానాల రూపంలో రైల్వేశాఖకు రూ.300కోట్లు

గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో జరిమానాల రూపంలో రూ.300 కోట్లను వసూలు చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. టికెట్ లేని ప్రయాణం, ముందస్తుగా బుక్ చేయకుండా లగేజ్ తరలించడం, తదితర కారణాలతో మొత్తం 46.26 లక్షల కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది. ముంబయి డివిజన్ పరిధిలో 20.56 లక్షల కేసులకు గాను రూ.115.29కోట్లు వసూలు చేసి తొలిస్థానంలో నిలిచింది. భుసావల్ డివిజన్లో 8.34లక్షల కేసులకు గాను రూ.66.33 కోట్లు వసూలయ్యాయి.
Similar News
News December 26, 2025
BHELలో అప్రెంటిస్ పోస్టులు

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(<
News December 26, 2025
ఫెలోపియన్ ట్యూబ్స్ పని చేయకపోవడానికి కారణాలు

ఫెలోపియన్ ట్యూబ్స్లో సమస్యలు చాలా తక్కువమందిలో కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఇన్ఫెక్షన్లు కలగడం, ట్యూబ్ దెబ్బతినడం లేదా తొలగిపోవడం వల్ల, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల శాశ్వతంగా ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినడం లేదా ఆ ట్యూబ్ని తీసివేయడం, పుట్టుకతోనే ఫెలోపియన్ ట్యూబ్ అసాధారణ రీతిలో అభివృద్ధి చెందడం, ఎండోమెట్రియోసిస్ సమస్య వల్ల ఫాలోపియన్ ట్యూబ్స్ పనిచేయకపోవచ్చంటున్నారు.
News December 26, 2025
తిరుమలలో రద్దీ.. దర్శనానికి 24 గంటలు

AP: వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టికెట్లు లేనివారికి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. శిలా తోరణం వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. కొండపై రూమ్స్ దొరకడం కష్టంగా మారింది. నిన్న 72వేల మంది భక్తులు వేంకన్నస్వామిని దర్శించుకున్నారు. హుండీకి రూ.4.12 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. కాగా డిసెంబర్ 28 వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.


