News April 6, 2024

కామారెడ్డి: ఆస్తి పన్ను చెల్లించే వారికి గుడ్ న్యూస్

image

కామారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరులోపు చెల్లించేవారికి అవకాశం వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిలు లేనివారికి ప్రస్తుతం రాయితీ ఇచ్చారు. బకాయిలు 85 శాతం దాటి వసూలు కావడంతో ఈ సారి నూతనంగా ప్రకటించిన పథకానికి స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Similar News

News September 10, 2025

NZB: సబ్ జూనియర్ బాస్కెట్‌బాల్ సెలక్షన్స్ నేడు

image

నిజామాబాద్ జిల్లా బాస్కెట్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక డీఎస్ఏ మైదానంలో ఇవాళ ఉదయం 11:30కు సబ్ జూనియర్స్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు బాస్కెట్‌బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు విజయ్ కుమార్, బొబ్బిలి నరేష్ తెలిపారు. ఈ సెలక్షన్స్‌లో పాల్గొనే క్రీడాకారులు 2012 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఇతర వివరాల కోసం ఆర్గనైజింగ్ కార్యదర్శి నిఖిల్‌ను సంప్రదించవచ్చని సూచించారు.

News September 9, 2025

గిరిజనులకు సౌర గిరి జల వికాసం పథకం: కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

image

గిరిజనులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ పథకాన్ని ప్రారంభించిందని, అర్హులైన పోడు పట్టాదారులను గుర్తించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ పథకం అమలుపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈ పథకం అమలు కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పోడు భూములకు పట్టాలు అందించినట్లు తెలిపారు.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన ఎంపీ అర్వింద్

image

ఉపరాష్ట్రపతి ఎన్నికకు మంగళవారం ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో MP అర్వింద్ ధర్మపురి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలోని ‘F-101 వసుధ’లో రహస్య బ్యాలెట్ విధానంలో ఆయన ఓటేశారు.