News April 6, 2024

93.42శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

image

AP: రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ 93.42 శాతం పూర్తయింది. 61,37,464 మంది లబ్ధిదారులకు రూ.1874.85 కోట్లను ప్రభుత్వం అందించింది. వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇళ్ల వద్దే పింఛన్లు అందించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. నేడు కూడా ఉదయం 7గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సచివాలయాల వద్ద పెన్షన్లు అందిస్తామని అన్నారు.

Similar News

News October 9, 2024

ఇవి పైసలు కావు.. జ్ఞాపకాలు!

image

పై ఫొటోలో కనిపిస్తున్నవి 5 పైసల నుంచి 20 పైసల వరకూ నాణేలు. ఇప్పుడంటే చలామణీలో లేవు గానీ 90వ దశకంలో పుట్టినవారికి ఇవి మధుర జ్ఞాపకాలు. వీటిని చూస్తే చిన్నతనంలో కొనుక్కున్న పిప్పరమెంట్, పప్పుండ, తాటి-మామిడి తాండ్ర, రేగి ఒడియం, నిమ్మ తొనల చాక్లెట్, బఠాణీలు, గోళీలలాంటివన్నీ గుర్తుకొస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మీ చిన్నతనంలో ఈ పైసలుండేవా..? మీ జ్ఞాపకాల్ని కామెంట్స్‌లో పంచుకోండి.

News October 9, 2024

ఒసామా బిన్ లాడెన్ కొడుకుపై ఫ్రాన్స్‌లో నిషేధం

image

ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్‌ను ఫ్రాన్స్ బహిష్కరించింది. ఓ బ్రిటిష్ పౌరురాల్ని పెళ్లాడి నార్మండీలో సెటిలై చాలాకాలంగా పెయింటింగ్స్ వేస్తూ కాలం గడిపిన ఒమర్, గత ఏడాది సోషల్ మీడియాలో ఉగ్రవాదానికి మద్దతునిస్తూ కామెంట్స్ పెట్టారు. దీంతో అతడిని దేశం నుంచి బయటికి పంపించిన ఫ్రాన్స్ ప్రభుత్వం తిరిగి రాకుండా నిషేధం విధించింది. ఒమర్ ప్రస్తుతం ఖతర్‌లో ఉన్నట్లు సమాచారం.

News October 9, 2024

ఆ అపాయింట్‌మెంట్ లెటర్లు ఫేక్: APPSC

image

AP: ఏపీపీఎస్సీ సభ్యుల ఆఫీస్‌ల నుంచి వచ్చే అపాయింట్‌మెంట్ లెటర్లు ఫేక్ అని ఏపీపీఎస్సీ తెలిపింది. అసలు ఏపీపీఎస్సీ మెంబర్లు అపాయింట్‌మెంట్ లెటర్లు ఇవ్వరని స్పష్టం చేసింది. అపాయింట్‌మెంట్ లెటర్ల పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఇచ్చి మోసపోవద్దని సూచించింది. ప్రతి శాఖలో విధి విధానాలకు లోబడే నియామకాలు జరుగుతాయని పేర్కొంది.