News September 28, 2025
38 మంది మృతి.. TVK సెక్రటరీపై కేసు నమోదు

కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే రిటైర్డ్ జడ్జితో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. TVK కరూర్ వెస్ట్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ వీపీ మతియళగన్పై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పొలిటికల్ ర్యాలీలో నిబంధనలు ఉల్లంఘించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. మతియళగన్ ఒక్కరిపైనే కేసు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరించారు.
Similar News
News February 15, 2026
విష ప్రయోగం వల్లే రష్యా ప్రతిపక్ష నేత మృతి: యూరప్ దేశాలు

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ జైలులో <<12701983>>అనుమానాస్పద రీతి<<>>లో చనిపోవడం తెలిసిందే. విష ప్రయోగం వల్లే ఆయన మృతిచెందినట్లు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ తాజాగా ఆరోపించాయి. నావల్నీ నుంచి సేకరించి నమూనాల్లో epibatidine అనే విషం ఆనవాళ్లు ఉన్నట్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. దక్షిణ అమెరికాలోని ప్రమాదకర కప్పల్లో ఈ విషం ఉంటుందని చెప్పాయి.
News February 15, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2026
గూడెబెల్లూర్ నుంచి మహబూబ్నగర్ దాకా NH-167 విస్తరణ: మోదీ

TG: హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్లో భాగంగా గూడెబెల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు NH-167ను 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై PM మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘NH-167 విస్తరణ నిర్ణయం ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. 80KM పొడవైన ఈ ప్రాజెక్టుకు ₹3,175 కోట్లు ఖర్చవుతుందని అంచనా.


