News April 6, 2024

శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 59,621 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.

Similar News

News November 10, 2025

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? రైల్వే టికెట్ బుకింగ్స్ మొదలు!

image

వచ్చే సంక్రాంతికి (జనవరి 2026) ఊళ్లకు వెళ్లాలనుకునేవారికి అలర్ట్. భారతీయ రైల్వే టికెట్ బుకింగ్స్ 60 రోజుల ముందుగానే ప్రారంభమవుతాయి. ఇవాళ జనవరి 9వ తేదీవి, రేపు JAN 10, ఎల్లుండి JAN 11, గురువారం రోజున జనవరి 12వ తేదీకి సంబంధించిన టికెట్లు రిలీజ్ కానున్నాయి. సొంతూళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండి IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా వెంటనే బుక్ చేసుకోవచ్చు. SHARE IT

News November 10, 2025

సేఫ్ పాస్‌వర్డ్ ఇలా సెట్ చేసుకోండి

image

సైబర్ నేరాలు, హ్యాకింగ్స్ విపరీతంగా పెరిగిపోతున్నందున <<18240768>>పాస్‌వర్డ్‌లపై<<>> ప్రత్యేక శ్రద్ద పెట్టాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు. పాస్‌వర్డ్‌ను ఎలా సెట్ చేసుకుంటే సేఫ్‌ అనే విషయాలను చెబుతున్నారు. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ లెటర్స్, నంబర్స్, సింబల్స్‌ కాంబోలో పాస్‌వర్డ్‌ సెట్ చేసుకోవాలని అంటున్నారు. ఫోన్ నంబర్లు, బర్త్‌డేలు, ఫ్యామిలీ మెంబర్ల పేర్లను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకోకూడదని హెచ్చరిస్తున్నారు.

News November 10, 2025

కర్బూజాలో బూజు తెగులును ఎలా నివారించాలి?

image

కర్బూజాలో బూజు తెగులు ఒక సాధారణ శిలీంధ్ర వ్యాధి. ఇది ఆకులు, కాండం, పండుపై తెల్లటి లేదా బూడిద రంగు బూజు మచ్చలను ఏర్పరుస్తుంది. ఈ బూజు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో మెటలాక్సిల్ 8%+మాంకోజెబ్ 64% డబ్ల్యూ.పి. 72% 400 గ్రా. లేదా డైమెథోమార్ఫ్ 9%+మాంకోజెబ్ 60% డబ్ల్యూ.పి. 300 గ్రా.లలో ఏదైనా ఒకదానితో పాటు జిగురు పదార్థం 100ml లను కలిపి మొక్కలకు సరిపడా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.