News April 6, 2024

NLG: టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

image

పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతమైంది. ఈనెల 3న నల్లగొండలో మూల్యాంకనం ప్రారంభించగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో శుక్రవారం అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరయ్యారు. సెలవు దినాల్లోనూ మూల్యాంకనం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు

Similar News

News May 7, 2025

FLASH: బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకుల మృతి

image

నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికలు తెలిపిన వివరాలు.. మునుగోడు మండలం ఊకోండి శివారులో బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

NLG: వచ్చేనెల 3 వరకు పింఛన్ల పంపిణీ

image

వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళల పింఛన్లు నేటి నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విషయాన్ని పింఛనుదారులు గమనించి పోస్టాఫీసుల ద్వారా తమ పింఛన్లను పొందాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి పత్రికా ప్రకటనలో తెలిపారు. దళారులను ఆశ్రయించకుండా నేరుగా పింఛన్ పొందాలని సూచించారు.

News April 25, 2025

నల్గొండ: కాంట్రాక్ట్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం

image

టీజీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వెంటాడుతుంది. ప్రస్తుతమున్న వారు డబుల్ డ్యూటీ చేయటం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శాశ్వత ప్రాతిపదికన డ్రైవర్ల నియామకం జరిగే వరకు తాత్కాలిక పద్ధతిన డ్రైవర్లను నియమించేందుకు నిర్ణయించినట్లు ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, యాదగిరిగుట్ట, నార్కట్ పల్లి, కోదాడ, దేవరకొండ డిపోల్లో 90 మంది డ్రైవర్లను నియమించనున్నట్లు తెలిపారు. 

error: Content is protected !!