News September 29, 2025
రాయలసీమ: ఆర్.యు పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

రాయలసీమ యూనివర్సిటీ పీజీ రెండో సెమిస్టర్ ఫలితాలను ఆదివారం ఉపకులపతి ప్రొఫెసర్ వెంకట్రావు బసవరావు విడుదల చేశారు. పీ. జీ రెండవ సెమిస్టర్ లో 462 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 413 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
విద్యార్థులు ఫలితాలను రాయలసీమ యూనివర్సిటీ వెబ్సైట్ https://rayalaseemauniversity.ac.in లో చూసుకోవచ్చని తెలిపారు.
Similar News
News September 28, 2025
తస్మాత్ జాగ్రత్త: ఎస్పీ

మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని స్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణ కోసం ప్రతీ శనివారం ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసి, వాహనదారులకు హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్, ఓవర్లోడ్, డ్రంకెన్ డ్రైవ్ వంటి వాటిపై ముఖ్య సూచనలు చేస్తున్నారని పేర్కొన్నారు.
News September 28, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లాలో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. వాగులు, వంకల వద్ద రాకపోకలు నిలిపివేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. విద్యుత్ తీగలు, నీటి ప్రవాహం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయగా, జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ (08518-277305) పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు.
News September 27, 2025
ఆపదలో ఉంటే 112కు కాల్ చేయండి: కర్నూలు ఎస్పీ

ఆపదలు, అత్యవసర పరిస్థితులు, సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా ప్రజల దృష్టికి వస్తే వెంటనే డయల్ 100, 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 నిమిషాల వ్యవధిలో ఘటనా స్థలానికి బ్లూ కోల్ట్స్, రక్షక్, పోలీసులు చేరుకుంటారన్నారు. డయల్ 112 హెల్ప్ లైన్ నంబర్ కమాండ్ కంట్రోల్కు అనుసంధానమై అందుబాటులో ఉంటుందన్నారు.