News September 30, 2025
గ్రూప్-3 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్

TG: రాష్ట్రంలో 1,388 గ్రూప్-3 పోస్టులకు సంబంధించి TGPSC ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ను విడుదల చేసింది. మొత్తం 4,421 మందిని జనరల్, 81 మందిని స్పోర్ట్స్ కోటాలో ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలకు ఇక్కడ <
Similar News
News October 12, 2025
Women’s WC: నేడు ఆసీస్తో హర్మన్ సేన ఢీ

మహిళల వన్డే WCలో భాగంగా విశాఖ వేదికగా ఇవాళ మ.3 గం.కు INDW-AUSW జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్కు అన్ని టికెట్లు బుక్ అవ్వడం విశేషం. భారత్ తొలి 2మ్యాచులు గెలిచి SAతో ఓడిపోయింది. అటు ఆసీస్ టీమ్ మంచి ఫామ్లో ఉంది. 2 విజయాలతోపాటు వర్షం కారణంగా SLతో మ్యాచ్ రద్దవడంతో పాయింట్లు పంచుకుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న AUSపై గెలవాలంటే కచ్చితంగా IND టాపార్డర్ సత్తా చాటాల్సిందే.
News October 12, 2025
స్కూల్స్లో UPIతో ఫీజుల చెల్లింపు!

దేశంలో UPI పేమెంట్స్కు ప్రాధాన్యత పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్కూల్స్లో ఫీజుల వసూలు ప్రక్రియను అప్గ్రేడ్ చేయాలని కేంద్రం కోరింది. అడ్మిషన్, ఎగ్జామ్ ఫీజు, స్కూళ్లకు సంబంధించిన లావాదేవీలకు UPI, మొబైల్ పేమెంట్స్ వంటి ఆధునిక విధానాలను వినియోగించాలని విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. CBSE, కేంద్రీయ విద్యాలయ, నవోదయ వంటి విద్యాసంస్థలు ఈ లిస్ట్లో ఉన్నాయి.
News October 12, 2025
బోలెడు ఆఫర్లతో JIO దీపావళి రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో సంస్థ దీపావళి, ధంతేరాస్ సందర్భంగా రూ.349తో స్పెషల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. 28 డేస్ వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMSలు ఉంటాయి. వీటికి అదనంగా 3 నెలల జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్(మొబైల్/TV ), ఫ్రీగా 50GB జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. హోమ్ ఇంటర్నెట్, స్మార్ట్ డివైజెస్, ఎంటర్టైన్మెంట్ సేవలు కలిగిన జియో హోమ్ ఫ్రీ ట్రైల్ 2 నెలలు పొందొచ్చు.