News April 6, 2024

పేపర్లు చూపించి కోట్లు అడుగుతున్నాడు: ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

image

అర్వింద్‌ ఎంపీగా ఉండి జిల్లాకు చేసింది శూన్యమని బాజిరెడ్డి అన్నారు. ఆయనపై ఏడు సెగ్మెంట్ల ప్రజలు గుర్రుగా ఉన్నారన్నారు. ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చి.. రైతులను మోసం చేశాడని మండిపడ్డారు. అప్పుడేమో బాండ్‌ పేపర్‌ చూపించి ఓట్లు దండుకున్న అర్వింద్‌ మళ్లీ ఇప్పుడు ఇటీవల ఏదో జీవో కాపీ తీసుకువచ్చి ఎంపీగా గెలిపించాలని ఓట్లు అడగడం ఎంతవరకు సమంజసమన్నారు.

Similar News

News October 28, 2025

CM రేవంత్, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు: MPఅర్వింద్

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని MP అర్వింద్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..CM రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరూ బిజినెస్ పార్టనర్లు కాబట్టే ఆమె రాజీనామా ఆమోదం పొందడం లేదని ఆరోపించారు. స్వయంగా కవితనే రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని ధ్వజమెత్తారు.

News October 28, 2025

NZB: అయ్యో.. రూ. 3 లక్షలు పోయాయ్..!

image

ఎన్నో ఆశలు, మరెన్నో ఉత్కంఠల మధ్య నిజామాబాద్ జిల్లాలో వైన్ షాపుల కేటాయింపునకు సంబంధించిన లక్కీ డ్రా సోమవారం పూర్తయింది. డ్రా ప్రక్రియను కలెక్టర్ పర్యవేక్షణలో నిర్వహించారు. విజేతలుగా నిలిచిన అదృష్టవంతుల మొహాల్లో సంతోషం వెల్లివిరిసింది. లక్కీ డ్రాలో తమ పేర్లు రాని వారి మొహాలు చిన్నబోయాయి. డబ్బులు పోయిన బాధతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకుంటే డ్రాలో పేరు రాలేదని నైరాశ్యంలో మునిగారు.

News October 28, 2025

NZB: DCC పీఠం దక్కేదెవరికో..?

image

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ భరితంగా మారింది. ఈ పదవి కోసం 17 మంది అధ్యక్ష పీఠం కోసం పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో NZBకు చెందిన నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, జావేద్ అక్రమ్, బాడ్సి శేఖర్ గౌడ్ తదితరులతో పాటు ఆర్మూర్, బాల్కొండ ప్రాంతాల వారు దరఖాస్తు చేశారు. ఇందులో వారికి పదవి అప్పగిస్తారనేది ఉత్కంఠ భరితంగా మారింది.