News September 30, 2025

తణుకు: యువకుడి అదృశ్యం కేసులో కీలక మలుపు!

image

తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన మడుగుల సురేష్ అదృశ్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తణుకు ప్రాంతానికి చెందిన న్యాయవాదితో పాటు మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. యువకుడిని హత్య చేసినట్లు నిందితులు పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో నేడు మిస్టరీ వీడే అవకాశం ఉంది.

Similar News

News October 1, 2025

తణుకు: అదృశ్యం కేసులో వీడని ఉత్కంఠ..గాలింపు చర్యలు ముమ్మరం

image

తణుకులో అదృశ్యమైన మడుగుల సురేష్ వ్యవహారంలో ఉత్కంఠ వీడడం లేదు. పోలీసుల విచారణలో నిందితులు హత్య చేసినట్లు అంగీకరించినప్పటికీ మృతదేహాన్ని ఏం చేశారనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు తణుకులోని గోస్తని నదితో పాటు చించినాడ వద్ద గోదావరి తీరంలో సురేష్ మృతదేహం కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సురేష్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

News October 1, 2025

అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: మంత్రి వర్మ

image

కేంద్ర ప్రభుత్వం పథకాల అమలు జిల్లా సమగ్ర అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద బ్యాంకులు లబ్ధిదారులకు విరివిగా రుణాలు మంజూరు చేసి పేద వర్గాలకు ఆర్థికంగా చేయూత నివ్వాలన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు.

News September 30, 2025

నరసాపురం తీరంలో విషపుటీగల గూడులు

image

నరసాపురం తీర ప్రాంతంలో విషపుటీగల గూడులు దర్శనమిస్తున్నాయి. ఇటీవల నరసాపురం మండలం వేములదీవి వెస్ట్ కాపులకొడప గ్రామంలో భార్యభర్తలపై ఇవి దాడి చేశాయి. 2004 సునామీ తరువాత సముద్రం మీదగా నరసాపురం తీర ప్రాంతానికి వచ్చిన ఈ విషపు ఈగలు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో తిష్ట వేశాయి. గతంలో పేరుపాలెం, పెదమైనవానిలంక గ్రామంలో వీటి దాడిలో పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.