News April 6, 2024

బద్వేల్‌లో అత్యధిక మెజారిటీ భార్యా భర్తలదే..

image

బద్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019లో వైసీపీ తరఫున దివంగత జి.వెంకటసుబ్బయ్య 44734 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆయన మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో దాసరి సుధ 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటితో గెలిచారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక మెజారిటీ. తాజాగా వైసీపీ నుంచి దాసరి సుధ, కూటమి నుంచి బొజ్జ రోషన్న బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో మీ అభిప్రాయం చెప్పండి.

Similar News

News October 22, 2025

కడప జిల్లాలో పరిస్థితిని బట్టి స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ వర్ష సూచనలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కడప జిల్లాలో మండలాల వారీగా నేడు స్థానికంగా ఉన్న పరిస్థితులు, వర్షాలు, ఇబ్బందులు ఆధారంగా సెలవును మండల MEOలు ప్రకటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కొద్దిసేపటి క్రితమే సర్కిలర్ జారీ చేశారు.

News October 22, 2025

కడప జిల్లా కలెక్టర్‌కు సెలవులు మంజూరు.!

image

కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈనెల 21 నుంచి 29 వరకు సెలవుపై వెళ్లనున్నారు. కాగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా JC అతిధిసింగ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ తిరిగి 29వ తేదీన విధుల్లో చేరనున్నారు.

News October 21, 2025

సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కడప జిల్లా వాసి

image

తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన ఈశ్వరయ్య సీపీఐ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గుజ్జుల ఈశ్వరయ్య ప్రాథమిక విద్య చదువుతుండగా.. విద్యార్థి ఉద్యమానికి ఆకర్షితుడై ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గాను, రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షునిగా సమస్యలపై, నిరుద్యోగ సమస్యపై సమస్యల పోరాటాలు నిర్వహించారు.