News April 6, 2024
వెంటాడి మరీ హతమారుస్తాం: రాజ్నాథ్ సింగ్

దేశంలో ఎవరైనా ఉగ్రదాడులకు పాల్పడి పాకిస్థాన్లో తలదాచుకోవాలని ప్రయత్నిస్తే ఆ దేశంలోకి వెళ్లి మరీ హతమారుస్తామన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ‘పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనే కోరుకుంటాం. కానీ ఎవరైనా భారత్లో ఉగ్రదాడులకు ప్రయత్నిస్తే సహించం’ అని తెలిపారు. కాగా 2020 నుంచి ఇప్పటివరకు పాక్లో 20 మందిని భారత ఏజెంట్లు చంపారన్న వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
Similar News
News November 4, 2025
సిరిసిల్ల: ‘పోషిస్తానని చెప్పి.. వెళ్లగొడుతున్నాడు’

రాజరాజేశ్వర జలాశయ ముంపు బాధితులైన కడుగుల రుక్కమ్మ–మల్లయ్య దంపతులు సోమవారం సిరిసిల్ల ప్రజావాణిలో ఇన్ఛార్జి కలెక్టర్కు దరఖాస్తు సమర్పించారు. పరిహారంగా వచ్చిన రూ. 7.50 లక్షలను తమ సొంత చెల్లెలి కొడుకు తీసుకున్నాడని, పోషిస్తానని చెప్పి ఇప్పుడు ఇంటి నుంచే వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్న తమకు న్యాయం చేయాలని, తమ సొమ్ము తిరిగి ఇప్పించాలని వారు వేడుకున్నారు.
News November 4, 2025
వంటింటి చిట్కాలు

*మరమరాలు మెత్తబడినప్పుడు రెండు నిమిషాలు వేయిస్తే మళ్లీ కరకరలాడతాయి.
* చేపను ఒక రోజు కంటే ఎక్కువ నిల్వ చేయాలంటే ముక్కలుగా కోసి ఉప్పు, వెనిగర్ పట్టించి డీప్ ఫ్రిజ్లో ఉంచాలి.
* ఉసిరికాయ నిల్వ పచ్చడి నలుపెక్కకుండా ఉండాలంటే జాడీలో పెట్టిన తర్వాత మధ్యలో  ఇంగువ ముక్క ఉంచండి.
*  బెండకాయలు 2, 3 రోజులు తాజాగా ఉండాలంటే తొడిమలతో పాటు రెండో చివరను కూడా కోసి ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి ఫ్రిజ్లో పెట్టాలి. 
News November 4, 2025
RITESలో 600 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. *ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


