News September 30, 2025

మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ

image

మెదక్ జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 5,23,327 ఓటర్లుండగా మహిళలు 2,71,787 మంది, పురుషులు 2,51,522 మంది, ఇతరులు 8 మంది ఉన్నారు. జిల్లాలో 21 జెడ్పిటీసి, 190 ఎంపీటీసీ స్థానాలు, 492 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ రాహుల్ రాజ్ వివరాలు వెల్లడించారు. అడిషనల్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ మహేందర్, సి ఈ ఓ ఎల్లయ్య, డిపీఓ యాదయ్య ఉన్నారు.

Similar News

News October 24, 2025

మెదక్: సర్పంచులు లేక మరుగునపడుతున్న గ్రామాలు!

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు సర్పంచులు లేక పూర్తిగా మరుగున పడిపోతున్నాయి. గ్రామంలో చిన్న సమస్యను చెప్పడానికి గ్రామానికి పెద్ద దిక్కు లేకపోవడంతో ప్రజలు అయోమయంలో ఉన్నారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే.. అయిన గ్రామ అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావిస్తే కోర్టులు ఎన్నికలను నిలిపివేశాయి. గ్రామాల్లో నియమించిన స్పెషల్ ఆఫీసర్లు కంటికి కనిపించడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

News October 24, 2025

మెదక్ జిల్లాలో 1420 మద్యం దరఖాస్తులు

image

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాల కోసం 1420 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పోతంశెట్టిపల్లి దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం సమయం పొడిగించడంతో 33 దరఖాస్తులు పెరిగాయి. మెదక్ సర్కిల్లో 17 దుకాణాలకు 513, నర్సాపూర్ సర్కిల్లో 17 దుకాణాలకు 519, రామాయంపేట సర్కిల్లో 15 దుకాణాలకు 388 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.42.60 కోట్ల ఆదాయం చేకూరింది.

News October 24, 2025

మెదక్: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

image

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HMలకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.