News April 6, 2024
మోదీ 3.0.. బడా నిర్ణయాలకు ప్లానింగ్ షురూ? – 2/2
2030 నాటికి కోర్టుల్లో పెండింగ్ కేసుల సంఖ్య కోటి దిగువకు తెచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. నియామకాలు, న్యాయవ్యవస్థను మెరుగుపర్చడం మొదలైన విషయాలు పరిశీలిస్తున్నారట. రక్షణ రంగానికి GDPలో 3% కేటాయింపు, జైళ్ల ఆక్యుపెన్సీ పెంపు, విచారణ ఎదుర్కొనే ఖైదీల సంఖ్య తగ్గింపు తదితర అంశాలపై కృషి చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మరోసారి గెలిస్తే మోదీ ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 5, 2025
Way2Newsలో ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్క్లూజివ్గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.
News February 5, 2025
కనిపించని కళాఖండానికి రూ.15లక్షలు!
కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.
News February 5, 2025
జగన్ 2.O చూడబోతున్నారు: YS జగన్
AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని జగన్ హెచ్చరించారు.