News October 1, 2025

దసరా పండుగ.. దోచేదాం దర్జాగా.!

image

పండగలు వస్తే చాలు ప్రైవేట్ ట్రావెల్స్‌లో టికెట్ల ధరలు రేసు గుర్రాల్లా పరుగులు తీస్తాయి. సాధారణ రోజుల్లో కన్నా అదనంగా ఛార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికుల నడ్డి విరుస్తాయి యాజమాన్యాలు. దసరా నేపథ్యంలో AC బస్సులలో నెల్లూరు TO HYDకు రూ.1200, స్లీపర్ రూ.2150 వరకు పెంచేశారు. బెంగళూరుకు రూ.1,000, స్లీపర్ రూ.1600-2 వేల వరకు ధర ఉంది. అదే RTCలో NLR-HYDకు సూపర్ లగ్జరీ రూ.850, లగ్జరీ రూ.740, ఏసీ రూ.1330గా ఉంది.

Similar News

News October 1, 2025

నెల్లూరు జిల్లా 2వ స్థానం

image

జిల్లా లో 2025 – 26 సం.కు గాను ఇన్‌స్పైర్ – మనక్ నామినేషన్లు విశేష స్పందన లభించినట్లు జిల్లా సైన్స్ అధికారి శివారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలో నిలువగా నెల్లూరు జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో 711 పాఠశాలలు నుంచి 2925 నామినేషన్లు అందినట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 3 వేలు నామినేషన్ రాగా, నెల్లూరు జిల్లా 2925 నామినేషన్లు వచ్చాయన్నారు.

News October 1, 2025

శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి సేవలో కలెక్టర్

image

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదుర్గా అలంకార రూపంలో కొలువైన జగన్మాతను మంగళవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కోవూరు జనార్ధన్ రెడ్డి ఆలయ మర్యాదలతో కలెక్టర్కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

News October 1, 2025

CM చంద్రబాబుపై బాంబు దాడి.. నేటికి 22 ఏళ్లు.!

image

అది అక్టోబర్ 1వ తేదీ 2003. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు చంద్రబాబు CM హోదాలో తిరుమలకు వస్తున్నారు. సరిగ్గా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు రాగానే ఒక్కసారిగా బాంబు శబ్దం. అందరూ తేరుకునేలోపే CM ఉన్న కారు గాల్లోకి ఎగిరి పడగా చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనకు నేటితో 22 ఏళ్లు. శ్రీవారి దయతోనే తాను ప్రాణాలతో బయటపడినట్లు పలు సందర్భాల్లో CM వ్యాఖ్యానించారు.