News April 6, 2024
ఎచ్చెర్ల: చిన్నరావుపల్లిలో రూ.1,22,206 కరెంట్ బిల్లు

ఎచ్చెర్ల మండలం చిన్నరావుపల్లి గ్రామంలో కరెంట్ బిల్లు చూసి బాధితులు శనివారం కంగుతిన్నారు. పప్పల ముకుందరావు అనే వారి ఇంటి కరెంట్ బిల్లు రూ.1,22,206 వచ్చింది. చిన్న ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటున్నారు. వారికి ఇంత కరెంట్ బిల్లు రావడంతో మేము ఎలా కట్టేది అని ఇంటి యజమాని లబోదిబోమంటున్నారు. వారి ఇద్దరు పిల్లలు బతుకుదెరువు కోసం వేరే ఊరిలో ఉంటున్నారు. సంబంధిత అధికారుల తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
Similar News
News January 9, 2026
కోటబొమ్మాళికి డిగ్రీ కాలేజీ మంజూరు..జిల్లాలో మొత్తం ఎన్నంటే?

శ్రీకాకుళం జిల్లాకు విద్యాశాఖ కోటబొమ్మాళిలో నూతనంగా డిగ్రీ కళాశాల మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల(అటానమస్), శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, టెక్కలి, పలాస, బారువ, ఇచ్ఛాపురం, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, తొగరాం, పొందూరు ప్రాంతాల్లో డిగ్రీ కళాశాలలో ఉన్నాయి. కొత్తది మంజూరు కావడంతో జిల్లాలో మొత్తం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 13కు చేరుకున్నాయి.
News January 9, 2026
రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.
News January 9, 2026
రథసప్తమి వేడుకలకు నేడు అంకురార్పణ కార్యక్రమం

అరసవల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో జరగనున్న రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 9న (శుక్రవారం) ఉదయం 8 గంటలకు అత్యంత వైభవంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.46 నిమిషాల పాటు సామూహిక సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఉంటాయని కమిటీ ప్రతినిధులు తెలిపారు.


