News April 6, 2024

జగనన్న కాలనీల్లో అవినీతి జరిగింది: పురందీశ్వరి

image

AP: కేంద్రం 22 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 3.50 లక్షలు మాత్రమే నిర్మించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి విమర్శించారు. జగనన్న కాలనీల్లో అవినీతి జరిగిందని, భూమిని చదును చేసే పేరుతో నిధులు దోచేశారని ఆరోపించారు. రాజమండ్రి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఈ పార్లమెంటు పరిధిలోని జనసేన, టీడీపీ అభ్యర్థులతో కలిసి పనిచేస్తామన్నారు.

Similar News

News October 9, 2024

ఓలాకు అండగా నిలిచిన హర్ష్ గోయెంకా

image

వివాదంలో చిక్కుకున్న ఓలా ఎలక్ట్రిక్ సంస్థకు వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా అండగా నిలిచారు. తాను చిన్న దూరాలు ప్రయాణించేందుకు ఓలా స్కూటర్‌నే వినియోగిస్తానంటూ ట్వీట్ చేశారు. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రాకు, ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్‌కు మధ్య నెట్టింట వాగ్వాదం అనంతరం కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ(CCPA) ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అటు సంస్థ షేర్లు సైతం 9శాతం పడిపోయాయి.

News October 9, 2024

ఆస్ట్రేలియా సిరీస్‌ ప్రదర్శనలో అతడే టాప్‌లో ఉంటాడు: లారా

image

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేస్తారని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశారు. ‘ఈసారి BGTలో అందరికంటే యశస్వీ బాగా ఆడతారు. కరీబియన్ దీవుల్లో ఆడినప్పుడు తన ఆటతీరు చూశాను. ఏ పరిస్థితుల్లోనైనా మంచి క్రికెట్ ఆడగల ప్లేయర్. టీమ్ ఇండియానే సిరీస్ గెలుచుకుంటుంది’ అని లారా జోస్యం చెప్పారు.

News October 9, 2024

అక్టోబర్ 9: చరిత్రలో ఈ రోజు

image

1945: భారతీయ సరోద్ విద్వాంసుడు అంజద్ అలీఖాన్ జననం
1962: గాయని ఎస్పీ శైలజ జననం
1967: గెరిల్లా నాయకుడు, క్యూబా విప్లవకారుడు చే గువేరా మరణం
1974: దర్శకుడు వివి వినాయక్ పుట్టినరోజు
2013: నటుడు శ్రీహరి మరణం
✦ ప్రపంచ తపాలా దినోత్సవం