News October 1, 2025
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎస్పీ

ప్రపంచ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా CMC ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రక్తదానం మరొకరి ప్రాణాలు నిలబెట్టే మహోన్నత సేవ అని తెలిపారు. రక్తం దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని వివరించారు. రక్తదానాన్ని విస్తృతంగా ప్రచారం కల్పించాలని, యువత ఇందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Similar News
News October 2, 2025
చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు

చిత్తూరులో జిల్లాలో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఏపీలో మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదం తెలిపింది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం, కుప్పం మండలం బైరుగానిపల్లెలో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర విద్యా శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాల తెలిపారు.
News October 1, 2025
చిత్తూరు జిల్లాలో 2 కేంద్రీయ విద్యాలయాలు

చిత్తూరులో జిల్లాలో కొత్తగా రెండు కేంద్రీయ విద్యాలయాలు రానున్నాయి. ఏపీలో మొత్తం 4 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఆమోదం తెలిపింది. చిత్తూరు సమీపంలోని మంగసముద్రం, కుప్పం మండలం బైరుగానిపల్లెలో వీటిని నిర్మించనున్నారు. ఈ మేరకు ప్రధాని, కేంద్ర విద్యా శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాల తెలిపారు.
News October 1, 2025
పెన్షన్ల పంపిణీలో చిత్తూరు జిల్లాకు నాలుగో స్థానం

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. చిత్తూరు జిల్లా పరిధిలో 2,68,307 పెన్షన్లకు గాను మొదటి రోజు 2,53,480 మంది లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 95.3%తో అనంతపురం అగ్రస్థానంలో ఉండగా 94.47%తో చిత్తూరు జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో అన్నమయ్య, తిరుపతి జిల్లాలు ఉన్నాయి.