News October 1, 2025
మలేసియా బృందానికి స్వాగతం పలికిన సీఆర్డీఏ అధికారులు

రాజధాని అమరావతిలో అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఐదు రోజుల పాటు పర్యటించేందుకు మలేసియా బృందం అమరావతికి చేరుకుంది. బృందంలోని సభ్యులైన మలేసియాలోని క్లాంగ్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు వైబి తువాన్ గణపతిరావు వీరమన్, మలేసియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి సతీశరావు వేంకటేశలం బుధవారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. CRDA అడిషనల్ కమిషనర్ అమిలినేని భార్గవ్ తేజ వారికి స్వాగతం పలికారు.
Similar News
News October 2, 2025
పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు టాప్..!

మెరుగైన పారిశుద్ధ్య నిర్వహనలో గుంటూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబరు నెలకు సంబంధించి IVRS ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా మన జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాధాన్య సర్వేలో 73.4% కుటుంబాలు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచినట్లు తేలింది. కాగా అటు 8వ స్థానంలో బాపట్ల, 11వ స్థానంలో పల్నాడు ఉన్నాయి
News October 2, 2025
GNT: గాంధీజీ రెండుసార్లు వచ్చిన ప్రదేశం..!

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామంలో వినయాశ్రమం ఉంది. ఈ ఆశ్రమం మహాత్మాగాంధీజీ చేతులమీదుగా 1933 డిసెంబరు 23 తేదీన ప్రారంభమైనది. స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ హరిజన యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ కల్లూరి చంద్రమౌళి వినతి మేరకు వినయాశ్రమంలో 2రోజులు గడిపారు. ఆనాడు ఆయన నాటిన రావి మొక్క నేడు మహావృక్షమైనది. రెండవసారి 1937 జనవరి 23న తుఫాను బాధితుల కోసం వచ్చారు.
News October 2, 2025
గుంటూరు జిల్లాలో ఆయనకి ఆలయాలు..!

ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా గాంధీ విగ్రహం లేని ఊర్లు లేవంటే అతిశయోక్తి కాదు. అలాంటి గాంధీజీకి గుంటూరు జిల్లాలో 2 దేవాలయాలు ఉన్నాయి. తెనాలిలో మహాత్మా గాంధీ ఆశ్రమం నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మహాత్మా గాంధీకి దేవాలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తుంటారు. కాగా రామలింగాచారి తన సొంత ఇంటిని అమ్మి వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. నరసరావుపేటలో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉంది.