News October 2, 2025

3వ తేదీ నుంచి జిల్లాలో రీ సర్వే గ్రామాల జాబితా విడుదల

image

ఈనెల 3వ తేదీ నుంచి జిల్లాలో 34 గ్రామాలలో రీ సర్వే నిర్వహించినట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. భూములు కలిగిన అందరూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భూముల హద్దులు రీ సర్వే టీంకు చూపించి రికార్డులలో తమ పేరు నమోదు చేసుకొని రీ సర్వే నిర్వహించు అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Similar News

News October 2, 2025

నెల్లూరు: ప్రమాదం అంచున బాలికలు!

image

కౌమార బాలికల్లో రక్త హీనత వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా31,242 మందికి ఈ ఏడాది జూన్ నుంచి sep వరకు హీమోమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. 22,538 మందికి HB వాల్యూ నార్మల్ గా ఉంది. కాగా MILD ANEMIA 6418, MODERATE ANEMIA 2256, SEVERE ANEMIA 30 మంది చొప్పున బాధపడుతున్నారు. జిల్లాలో 8704 మంది కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

News October 2, 2025

వైసీపీలో మాజీ ఎంపీ ఆదాలకు కీలక పదవి

image

వైసీపీ మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి వైసీపీలో కీలక పదవి దక్కింది. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆయన చోటు దక్కింది. గత ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సేవల్ని పార్టీ వినియోగించుకోవాలని భావించడంతో ఆయన CEC లో చోటు దక్కింది. దీంతో ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News October 2, 2025

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజలకు శ్రీ దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, సకల శుభాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ దుర్గ భవాని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరారు.