News October 2, 2025

ఎంపీ మాగుంట ఛైర్మన్ పదవీ కాలం పొడిగింపు

image

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్లమెంట్ గృహ పట్టణ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. ఈక్రమంలో ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీచేశారు.

Similar News

News October 2, 2025

ప్రకాశంతో.. గాంధీజీకి ఉన్న అనుబంధం ఇదే!

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మహాత్మాగాంధీజీకి గొప్ప అనుబంధం ఉంది. వేటపాలెంలోని సారస్వత నికేతనం గ్రంథాలయానికి పునాది వేసింది స్వయానా గాంధీజీనే. 1929లో వేటపాలెంకు వచ్చిన గాంధీజీకి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చారు. ఆ సమయంలో గాంధీజీ చేతికర్ర స్వల్పంగా విరిగింది. దీంతో తన జ్ఞాపకార్థం ఆ కర్రను గ్రంథాలయంలోనే గాంధీజీ వదిలివెళ్లారు. నేటికీ గ్రంథాలయానికి వెళితే, గాంధీ చేతి క ్ర్ర‌ను దర్శించవచ్చు.

News October 2, 2025

ఒంగోలులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

ఒంగోలులోని బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ బయట, ప్రహరీ గోడ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎటువంటి గాయాలు లేవని, అయితే స్థానికంగా యాచకుడు అన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

News October 2, 2025

ప్రకాశం: మొదలైన దసరా దందా..!

image

దసరా సందర్భంగా పెరిగిన ప్రయాణికుల డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, ప్రైవేట్ ట్రావెల్స్ సాధారణ ఛార్జీలను అమాంతం పెంచేశాయి. రైళ్లలో సీట్లు నిండిపోవడం, ప్రభుత్వ బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వంటి పరిస్థితుల్లో ప్రజలు ప్రైవేట్ ట్రావెల్స్ ఆశ్రయించాల్సివస్తుంది. సాధారణంగా ఒంగోలు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు ప్రాంతాలకు HYD నుంచి రూ.700 ఉండే ధర ఇప్పుడు రూ.1000 పైనే ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.