News October 2, 2025
నెల్లూరు: ప్రమాదం అంచున బాలికలు!

కౌమార బాలికల్లో రక్త హీనత వేధిస్తుంది. జిల్లా వ్యాప్తంగా31,242 మందికి ఈ ఏడాది జూన్ నుంచి sep వరకు హీమోమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు. 22,538 మందికి HB వాల్యూ నార్మల్ గా ఉంది. కాగా MILD ANEMIA 6418, MODERATE ANEMIA 2256, SEVERE ANEMIA 30 మంది చొప్పున బాధపడుతున్నారు. జిల్లాలో 8704 మంది కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉందనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
Similar News
News October 2, 2025
నెల్లూరు: అనుమతులు లేకుండానే ఆక్వా సాగు!

ప్రభుత్వ భూముల్లో అనుమతి పత్రాలు లేకుండా 12,734 మంది రైతులు 16,836.84 ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. రెవెన్యూ నుంచి NOC లేకుండా ఈతంతు సాగుతోంది. రీసర్వే జరగని కారణంగా 8678.56 ఎకరాలకు చెందిన 4174 మంది తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి LPM నంబర్లు తప్పనిసరిగా ఉంది. మరోవైపు ఈనెల 20వ తేదీలోగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్లు పొందాలని ఫిషరీస్ JD శాంతి తెలిపారు. దీంతో విద్యుత్ రాయితీలు పొందవచ్చన్నారు.
News October 2, 2025
నెల్లూరు: రొయ్య రైతుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు!

అమెరికా టారిఫ్స్ తో జిల్లాలో కుదేలైన అక్వా రంగంలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. రొయ్య సాగు రైతుల్లో ఏర్పడిన అలజడి నెమ్మదిగా సద్దుమణుగుతుంది. రొయ్యల ఎగుమతుల ప్రత్యామ్నాయాలపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో 10% ఉన్న రష్యా ఆర్డర్ 40% పెరిగిందని సమాచారం. తాజాగా యూరప్ దేశాల నుంచి ఆర్డర్లు రావడం కూడా రైతులలో మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని ఎగుమతిదారులు చెబుతున్నారు.
News October 2, 2025
నెల్లూరు: తగ్గనున్న విద్యుత్ చార్జీలు

ఎన్నికల వేళ విద్యుత్తు బిల్లులు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకున్నారు. తాజాగా ట్రూ డౌన్ సమీక్షలో జిల్లా వినియోగదారులపై రూ.32 కోట్లు భారం తగ్గనుంది. జిల్లాలో 12,37,429 కనెక్షన్లు ఉండగా రోజుకు సుమారు 13 మిలియన్ యూనిట్లు వినియోగమవుతున్నాయి. గతంలో యూనిట్కు అదనంగా 40 పైసలు వసూలు చేసిన చోట, ఇకపై 13 పైసలు తగ్గింపు లభించనుంది. నవంబరు బిల్లుల నుంచే అమలు జరగనుందని SE కే.రాఘవేంద్ర తెలిపారు.