News October 2, 2025
చిత్తూరు జిల్లాకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర అవార్డ్స్

చిత్తూరు జిల్లాకు స్వర్ణాంధ్ర-2025 అవార్డులు దక్కాయి. రాష్ట్రస్థాయిలో ఆరు అవార్డులు, జిల్లా స్థాయిలో 48 అవార్డులు దక్కాయి. ఈనెల ఆరో తేదీన మంత్రి మండిపల్లి అవార్డుల ప్రదానం చేయనున్నారు పరిశుభ్రత రంగంలో విశిష్ట సేవలకు ఈ అవార్డులు దక్కాయి. ఈ మేరకు వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఈ విజయాలు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన వెల్లడించారు.
Similar News
News October 2, 2025
తమిళ పోలీసులను సర్వీస్ నుంచి తొలగింపు

చిత్తూరు జిల్లాకు చెందిన మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ తిరువన్నామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ సుందర్, సురేశ్ రాజ్లను పోలీస్ సర్వీస్ నుంచి తొలగిస్తూ ఎస్పీ సుధాకర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ను ఇప్పటికే అరెస్టు చేసి వేలూరు జైలులో రిమాండ్కు తరలించారు. ఇనపద్దంలో ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగిస్తూ SP ఉత్తర్వులు జారీ చేశారు.
News October 2, 2025
చిత్తూరు: ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికీ పెద్దిరెడ్డిదే హవా?

గతంలో సీమను తన కనుసన్నల్లో శాసించిన పెద్దిరెడ్డి హవానే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో సాగుతోందట. పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లి, జీడీ నెల్లూరు, పీలేరు, పలమనేరులో బాహాటంగానే పెద్దిరెడ్డి అనుచరులు టీడీపీలో చేరి ఆయనకు సహకరిస్తున్నారట. గత ప్రభుత్వం హయాంలో పెత్తనం చెలాయించిన నేతలు ఇప్పుడు టీడీపీ కండువా కప్పుకుని గ్రావెల్, ఇసుక దందా, అక్రమం మైనింగులకు పాల్పడుతున్నట్లు తెలుగుతమ్ముళ్లు ఆరోపిస్తున్నారు.
News October 2, 2025
చిత్తూరు: ఎనిమిది KGBVల్లో సీసీ కెమెరాలు

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో బాలికల భద్రత నిమిత్తం సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 8 కేజీబీవీలకు సీసీ కెమెరాలను మంజూరు చేసిందన్నారు. వీటిల్లో ప్రత్యేక బృందం సీసీ కెమెరాలను అమర్చుతారన్నారు.