News October 2, 2025
గోదావరిలో వృద్ధుడు గల్లంతు

నిడదవోలు మండలం పెండ్యాలలో గురువారం గోదావరి నదిలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిరంజీవి (63) అనే వృద్ధుడు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి కొట్టుకుపోయారని స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు జాలర్లసాయంతో నదిలో గాలిస్తున్నారు. ఈ ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్ స్పందించారు. గాలింపు చర్యలు మమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 3, 2025
జీఎస్టీ తగ్గిన మందుల ధరలపై అవగాహన పెంచాలి: డీఎంహెచ్ఓ

జీఎస్టీ తగ్గిన మందుల ధరలపై ప్రజలకు అవగాహన పెంచాలని డీఎంహెచ్వో కె.వెంకటేశ్వరరావు సూచించారు. జీఎస్టీ 2.0 సంస్కరణ ద్వారా మందులు వైద్య పరికరాలపై ఇప్పటివరకు 12 శాతం ఉన్న జీఎస్టీ ఐదు శాతానికి తగ్గిందన్నారు. కొన్నింటిపై పూర్తిగా తగ్గించడం ద్వారా రోగులకు చికిత్స మరింత చౌకగా లభించిందన్నారు. చిన్నారులకు అవసరమైన ఫీడింగ్ బాటిల్స్, లైనర్లు, నాప్కిన్లు వంటి వస్తువులపై పూర్తి శాతం జీఎస్టీ తగ్గించారన్నారు.
News October 3, 2025
రాజమండ్రి: గౌతమీ తీరాన మహాత్ముని అడుగుజాడలు

రాజమండ్రి గాంధీ జయంతి సందర్భంగా కోటిపల్లి బస్టాండ్ వద్ద స్వాతంత్ర సమరయోధుల పార్కులో బాపుకి పలువురు నివాళులర్పించారు. గౌతమీ తీరాన స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో 1921-46 మధ్య కాలంలో మహాత్ముడు రాజమహేంద్రవరానికి 5 సార్లు వచ్చారు. 1921 మార్చి 30న, అదే సంవత్సరం ఏప్రిల్ 4న, 1929 మే 6 న, 1933 డిసెంబర్ 25న, 1946 జనవరి 20న రాజమండ్రి నగరంలో పలు బహిరంగ సభల్లో ప్రసంగించారని బాపుకి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.
News October 2, 2025
తూ.గో జిల్లాకు మూడు రాష్ట్ర స్థాయి అవార్డులు

స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాకు రాష్ట్ర స్థాయిలో 3 అవార్డులు, జిల్లా స్థాయిలో 51 అవార్డులు వచ్చాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం ఈ మేరకు కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. స్వచ్ఛత కేటగిరీలో ప్రత్యేకంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి “స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు”తో ప్రత్యేక గుర్తింపు సాధించినట్లు కలెక్టర్ వెల్లడించారు.