News October 2, 2025
జూబ్లీహిల్స్ బరిలో జయసుధ?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. రోజుకో నేత పేరు తెర మీదికి వస్తుండడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. తాజాగా BJP నుంచి మాజీ ఎమ్మెల్యే, సినీనటి జయసుధ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె స్టేట్ చీఫ్ N.రాంచందర్రావు భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఇక్కడ BJP నుంచి లంకల దీపక్ పోటీ చేశారు. ఆయన పేరు కూడా సెగ్మెంట్లో వినిపిస్తోంది.
Similar News
News October 3, 2025
నాంపల్లి: నేడు దత్తన్న అలయ్.. బలయ్

నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్.. బలయ్ కార్యక్రమం భారీ ఎత్తున్న జరిగింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏటా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎంలు, కేంద్ర మంత్రులు, సినీ రంగ ప్రముఖులు, వివిధ పార్టీల కీలక నేతలు పాల్గొనున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి రావాలని అందరికీ ఆహ్వానం అందించారు.
News October 3, 2025
నేడు CM చేతుల మీదుగా ఫలక్నుమా ROB ప్రారంభం

పాతబస్తీ వాసులకు శుభవార్త. నేడు ఫలక్నుమా ROB CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభంకానుంది. రూ.52.03 కోట్లతో 360.0 మీటర్ల పొడవులో GHMC, SCR సంయుక్తంగా దీనిని నిర్మించింది. బర్కస్ నుంచి చార్మినార్ రూట్తో పాటు ఫలక్నుమాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ROB ఉపయోగపడుతుంది. ఉదయం 9:15 నిమిషాలకు CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జీ మంత్రులు, MP అసదుద్దీన్ ఒవైసీతో కలిసి ప్రారంభించనున్నారు.
News October 2, 2025
హైదరాబాద్: మూసీ అందాలు కనువిందు చేసేలా!

మూసీ నది అందాలు కనువిందు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నగరంలో మూసీ నది దాదాపు 55 కిలోమీటర్ల మేర విస్తరించింది. ముందుగా 20.5 కిలోమీటర్లను సుందీకరించనున్నారు. ఇందుకు దాదాపు రూ.5,641 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. హిమాయత్సాగర్ నుంచి బాపూఘాట్ వరకు (9.5KM), ఉస్మాన్సాగర్ నుంచి బాపూఘాట్ (11 KM) వరకు సుందరీకరించనున్నారు. త్వరలో ఈ పనులు ప్రారంభం కానున్నట్లు తెలిసింది.