News October 3, 2025
అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు

1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం(ఫొటోలో)
1954: నటుడు సత్యరాజ్ జననం
1968: రచయిత, నిర్మాత, దర్శకుడు ఎన్.శంకర్ జననం
1978: భారత్లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం(ఫొటోలో)
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం
2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
Similar News
News October 3, 2025
గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 57 మంది మృతి

ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్కు హమాస్ ఇంకా అంగీకరించకపోవడంతో గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. నిన్నటి నుంచి పలుచోట్ల చేపట్టిన దాడుల్లో 57 మంది పాలస్తీనియన్లు మరణించారు. సౌత్ గాజాలో 27 మంది, ఆహార పంపిణీ కేంద్రాల వద్ద 30 మంది చనిపోయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. అటు గాజాకు మానవతాసాయాన్ని అందించేందుకు వచ్చిన 40కి పైగా షిప్పులను ఇజ్రాయెల్ బలగాలు అడ్డుకున్నాయి.
News October 3, 2025
ముగిసిన దసరా సెలవులు

AP: రాష్ట్రంలో స్కూళ్లకు దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. ఇవాళ్టి నుంచి క్లాసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి వరుసగా 11 రోజుల పాటు హాలిడేస్ ఆస్వాదించిన విద్యార్థులు, టీచర్లు ఇక బడి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పండుగ కోసం ఊర్లకు వెళ్లినవారు ప్రభుత్వం సెలవులను ఒక్కరోజైనా పొడిగిస్తుందని ఆశగా ఎదురుచూశారు. నిన్న రాత్రి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరాశచెందారు.
News October 3, 2025
ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు- గరుడాద్రి

తిరుమలలోని ఏడు కొండలు ఏడు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి. మూడవ కొండను గరుడాద్రిగా పిలుస్తారు. ఇక్కడ ధ్యానం చేస్తే సాధకుని కుండలిని శక్తి మణిపుర చక్రాన్ని తాకుతుంది. ఇప్పటికి సాధకుడికి సెల్ఫ్ కంట్రోల్ వచ్చేస్తుంది. జ్ఞాన శక్తి, గ్రహణశక్తి పెరుగుతుంది. ‘గ’కార శబ్దం జ్ఞానానికి ప్రతీక. అందుకే కొండకి గరుడాద్రి అని పేరు. ఇది సాధకుని జ్ఞానార్హతను సూచిస్తుంది.
<<-se>>#VINAROBHAGYAMU<<>>