News October 3, 2025
నిన్న నాన్వెజ్ ఎక్కువైందా? ఇలా చేయండి

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం ఆయుధ, శమీ పూజలతో మొదలెట్టి రాత్రి రావణ దహనంతో వేడుకలను ముగించారు. గాంధీ జయంతి అయినప్పటికీ మాంసం, మద్యం విషయంలో చాలామంది కాంప్రమైజ్ కాలేదు. నిన్న నాన్వెజ్ ఎక్కువగా తిన్నవారు ఇవాళ లైట్, ఫైబర్ రిచ్, లోఫ్యాట్ డైట్ పాటిస్తూ ప్రోబయాటిక్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హైడ్రేషన్ కోసం నీరెక్కువగా తాగాలంటున్నారు. SHARE IT
Similar News
News October 3, 2025
చంద్రముఖి, కాదంబినీ.. వీరి ప్రత్యేకత తెలుసా?

ఒకప్పుడు దేశంలో మహిళలు కట్టుబాట్ల పేరుతో ఎంతో వివక్షకు గురయ్యారు. అలాంటి కాలంలోనే పలువురు ధైర్యంగా ముందడుగు వేసి చరిత్రలో తమ పేజీని లిఖించుకున్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ 1882లో కలకత్తా వర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి మహిళలుగా రికార్డు సృష్టించారు. వీరు భారత స్త్రీలకు విద్యారంగంలో మార్గదర్శకులుగా నిలిచారు.
<<-se>>#FirstWomen<<>>
News October 3, 2025
రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం: KTR

TG: అరాచకత్వం, అనుభవలేమితో ఉన్న రేవంత్ పాలనలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సెప్టెంబర్లో GST వసూళ్లలో తెలంగాణ అట్టడుగున ఉండటం దారుణమని దుయ్యబట్టారు. రెండేళ్ల క్రితం KCR పాలనలో తెలంగాణ తొలి స్థానంలో ఉందని గుర్తు చేశారు. తమ హయాంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలూ నేల చూపులే చూస్తున్నాయని మండిపడ్డారు.
News October 3, 2025
రెండు దశల్లో బిహార్ ఎన్నికలు?

బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6న లేదా 7న నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఛఠ్ పండుగ తర్వాత అక్టోబర్ 31-నవంబర్ 2 మధ్య తొలి దశ ఎన్నికలు, 5-7 మధ్య రెండో దశ ఎలక్షన్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే నెల 10న ఫలితాలు రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఎన్నికలతో పాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు బై పోల్స్ జరగనున్నాయి. ఇందులో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా ఉంది.