News October 3, 2025

తిరుమల: శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. సర్వ దర్శనానికి 20గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనం కోసం బాట గంగమ్మ వరకు భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 75,188 మంది దర్శించుకోగా.. 31,640 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.66కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిన్న ధ్వజావరోహణంతో ముగిసిన విషయం తెలిసిందే.

Similar News

News October 3, 2025

‘భూతం’ అంటే చెడు శక్తులు కాదా?

image

కాంతార మూవీలోని భూత-కోలా ఆచారంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది దైవమని కొందరు, దుష్ట శక్తి అని ఇంకొందరు నమ్ముతారు. అయితే ‘భూత’ అంటే గడిచిన కాలం, ప్రకృతిని రక్షించే శక్తులు అని భాషా వేత్తలు చెబుతున్నారు. అదే ‘భూతం’ అనే పదంగా ప్రతికూల(దుష్ట) శక్తిగా ప్రచారమైందని అంటున్నారు. సినిమాలో చూపించిన భూత కోలా అంటే ప్రకృతి శక్తుల ఆరాధన అని అర్థమట. తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఈ కళను ప్రదర్శించారు. <<-se>>#kanthara<<>>

News October 3, 2025

‘స్త్రీనిధి’ చెల్లింపులకు యాప్.. ఎలా వాడాలంటే?

image

AP: బ్యాంకుకు వెళ్లకుండా నేరుగా స్త్రీనిధి వాయిదా చెల్లింపుల కోసం ప్రభుత్వం ‘కాప్స్‌ రికవరీ’ అనే యాప్‌ను తీసుకొచ్చింది. అందులో సభ్యురాలి ఫోన్‌ నంబరు/పిన్‌‌తో లాగిన్‌ అవ్వాలి. గ్రూప్ పేరు సెలెక్ట్ చేస్తే లోన్ తీసుకున్నవారి లిస్ట్ కనిపిస్తుంది. పేరు క్లిక్‌ చేయగానే ఆమె చెల్లించాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది. డబ్బు చెల్లించాక రసీదు జనరేట్ అవుతుంది.

News October 3, 2025

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఎస్ఈసీ

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, ZPTC ఎలక్షన్స్‌కు 37,652, పంచాయతీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా 1,18,547 ఉన్నాయని తెలిపింది. జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు దశల వారీగా 651 మంది, ఎంపీటీసీ ఎన్నికలకు 2,337 మంది ఆర్వోలు, 2,340 మంది ఏఆర్‌వోలు, 39,533 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 1,58,725 మంది ఇతర సిబ్బంది రెడీగా ఉన్నారని వివరించింది.