News October 3, 2025
INDvsWI టెస్టు.. రెండో రోజు ఆట మొదలు

అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్, టీమ్ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మొదటి రోజు తొలి ఇన్నింగ్సులో WI 162 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం టీమ్ ఇండియా 2 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో రాహుల్(62*), గిల్(20*) ఉన్నారు. ఇవాళ భారత బ్యాటర్లు నిలదొక్కుకుంటే వెస్టిండీస్పై పైచేయి సాధించే అవకాశం ఉంది.
Similar News
News February 18, 2026
ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

న్యూఢిల్లీలోని <
News February 18, 2026
ఫాల్గుణ మాసంలో ఇలా చేయండి: పండితులు

మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం ఫాల్గుణం. ఈ నెలలో లక్ష్మీనారాయణులను భక్తితో కొలిస్తే శుభాలు కలుగుతాయని పండితుల మాట. ‘చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరొచ్చింది. అర్జునుడికి ‘ఫల్గుణుడు’ అనే పేరుండటం మరో ప్రత్యేకత. దానధర్మాలు చేయడం, పవిత్ర నదులలో స్నానమాచరించడం వల్ల పుణ్యం లభిస్తుంది. ప్రకృతి వసంతానికి సిద్ధమయ్యే ఈ కాలంలో ఆధ్యాత్మిక చింతనతో గడపడం ఉత్తమం’ అంటున్నారు.
News February 18, 2026
మిరప మొక్కల వేర్లపై బొడిపెలకు కారణమేంటి?

మిరప పంటకు నులి పురుగులు ఆశించడం వల్ల మొక్కల వేర్లపై బొడిపెలు ఏర్పడతాయి. దీని వల్ల పంటకు నష్టం వాటిల్లుతుంది. ఈ నులి పురుగుల నివారణకు ఎకరాకు 100 కిలోల వేప పిండిని చల్లి, మట్టిలో కలిసే విధంగా నీరు పెట్టాలి. ఈ పురుగులు ఆశించిన పొలంలో వంగ, టమాటా, బంగాళాదుంపలను సాగు చేయకూడదు. ఆవాలు, నువ్వులు, మొక్కజొన్న, చిరుధాన్యాలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


