News October 3, 2025

‘రాణీ కనకవతి’గా కట్టిపడేసిన రుక్మిణీ

image

‘కాంతార’కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ‘కాంతార ఛాప్టర్-1’ నిన్న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రాణీ కనకవతిగా రుక్మిణీ వసంత్ ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఆమె పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్, అందం, అభినయానికి ఫిదా అవుతున్నారు. కథను మలుపు తిప్పే పవర్‌ఫుల్ రోల్‌కు రుక్మిణీ న్యాయం చేశారు. SMలో ఆమె పేరు మారుమోగిపోతోంది. మూవీ చూసినవారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి.

Similar News

News February 17, 2026

150కి 20 మార్కులొచ్చినా టీచర్ జాబ్.. విమర్శలు

image

ఉపాధ్యాయ నియామకాల్లోనూ రిజర్వేషన్లు ఉండటంపై విమర్శలొస్తున్నాయి. ఒడిశా టీచర్ నియామకాల్లో రిజర్వేషన్ల వారీగా ఉన్న మార్కుల వ్యత్యాసాన్ని చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. రిజర్వ్‌డ్ కేటగిరీకి 20/150 మార్కులు వచ్చినా ఉద్యోగం లభిస్తే.. EBC అభ్యర్థులకు 121 మార్క్స్ రావాల్సిందే. ఇంత తక్కువ మార్కులు వచ్చిన వారు పిల్లలకు ఎలా బోధిస్తారని, ఇది విద్యావ్యవస్థ నాణ్యతను దెబ్బతీస్తుందని చెబుతున్నారు. మీ కామెంట్?

News February 17, 2026

నటి ప్రత్యూష కేసు.. నిందితుడు లొంగిపోవాలని సుప్రీం ఆదేశం

image

నటి ప్రత్యూష మృతి <<19162866>>కేసులో<<>> సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. 4 వారాల్లో పోలీసుల ఎదుట లొంగిపోవాలని నిందితుడు సిద్దార్థ రెడ్డిని ఆదేశించింది. హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించింది. పోస్టుమార్టం అన్‌ప్రొఫెషనల్‌గా నిర్వహించారని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

News February 17, 2026

బీర పంటకు నీటిని ఇలా అందిస్తే మేలు

image

బీర విత్తనాలను నాటడానికి ముందు పొలంలో నీరు పెట్టాలి. తర్వాత ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3-5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉన్నప్పుడు నీరు ఇవ్వాలి. వేసవి పంటకు నాలుగైదు రోజులకు ఒకసారి నీరు అందించాలి. మొక్కకు దగ్గరగా కాకుండా కాస్త దూరంలో ఎరువు వేయాలి. తర్వాత ఎరువుపై మట్టిని కప్పి నీటిని పెట్టడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.