News April 6, 2024

జగన్ పాలన ఓ పీడ కల: చంద్రబాబు

image

AP: సీఎం జగన్ ఐదేళ్ల పాలన ఓ పీడ కల అని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ అన్యాయం జరిగింది. ముస్లింలపై అనేక అరాచకాలు జరిగాయి. అధికారంలోకి రాగానే నదుల అనుసంధానం చేసి ప్రతీ ఎకరాకు నీళ్లందిస్తా. పేదలకు ఉచిత ఇసుక అందిస్తా. యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా. జనం భవిష్యత్ కోసమే మూడు పార్టీలు కలిశాయి. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 9, 2024

నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

image

నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.

News October 9, 2024

నిలవాలంటే గెలవాల్సిందే..

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్‌కు కాస్త ప్లస్‌గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.

News October 9, 2024

విదేశీ విద్య: ఏ ఇన్‌టేక్ మంచిది..?

image

విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్‌ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్‌టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్‌ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్‌టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్‌టేక్‌ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.