News October 3, 2025

విజయనగరంలో పైడిమాంబ ఇలా వెలిశారంట..!

image

విజయనగరం, బొబ్బిలి రాజులకు మధ్య 1757 జనవరి 24న జరిగిన యుద్ధంలో <<17901439>>పైడిమాంబ<<>> అన్న విజయరామరాజు యుద్ధానికి వెళుతుండగా వద్దని అమ్మ వారించారు. పంతానికి పోయి యుద్ధానికి వెళ్లిన అన్న మృతి వార్త విన్న పైడితల్లమ్మ పెద్ద చెరువులో దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు. అనంతరం పతివాడ అప్పలనాయుడు అనే వ్యక్తి కలలో కనిపించి చెరువులో విగ్రహామై వెలసి ఉన్నానని చెప్పగా ఆయన వెలికి తీయించారు. అదే ఇప్పుడు వనం గుడిగా పిలవబడుతుంది.

Similar News

News October 3, 2025

సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం

image

సీఎం చంద్రబాబు శనివారం ‘ఆటో డ్రైవర్ సేవలో’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉదయం 9:30 గంటలకు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2025

వరంగల్: ఆ సీఐ ముందు నుంచి వివాదాస్పదుడే..!

image

నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి ముందు నుంచి వివాదాస్పదుడిగా తెలుస్తోంది. గతంలో జనగామ సీఐగా పనిచేసిన సమయంలో అడ్వకేట్ అమ్భతరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న ఘటనలో భార్య ఎదుటే అడ్వకేట్‌‌ను అవమానపరిచాడనే ఆరోపణలతో సీపీ విచారణ జరిపారు. తాజాగా గాంధీ జయంతి రోజు నర్సంపేటలో జంతువధను చేస్తున్న సమయంలో కత్తితో త్వరగా కొట్టు అంటూ అనడంపై వివాదాస్పదమైంది. ఈ ఘటనపై DCP ఈస్ట్ జోన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.

News October 3, 2025

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, జీఎస్టీకి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సీటీవో ఏలూరు సర్కిల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సిటీవో చిట్టిబాబు తెలిపారు. జీఎస్టీ వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రజలు సీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 8096082086‌కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చునని తెలిపారు. నేరుగా కార్యాలయాన్ని కూడా సంప్రదించి వివరాలు పొందవచ్చన్నారు.