News October 3, 2025
HYD: పెద్దనాన్న వేధింపుతో విద్యార్థిని సూసైడ్

సొంత పెద్దన్నాన అత్యాచార వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నగరంలో కలకలం రేపింది. పోలీసుల వివరాలిలా.. కొంపల్లిలోని పోచమ్మ గడ్డలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ దొరకగా పెద్దనాన్నే కాలయముడయ్యాడని తేలింది. పేట్బషీరాబాద్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 3, 2025
సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం

సీఎం చంద్రబాబు శనివారం ‘ఆటో డ్రైవర్ సేవలో’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉదయం 9:30 గంటలకు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 3, 2025
వరంగల్: ఆ సీఐ ముందు నుంచి వివాదాస్పదుడే..!

నర్సంపేట సీఐ రఘుపతి రెడ్డి ముందు నుంచి వివాదాస్పదుడిగా తెలుస్తోంది. గతంలో జనగామ సీఐగా పనిచేసిన సమయంలో అడ్వకేట్ అమ్భతరావు, అతడి భార్యను అదుపులోకి తీసుకున్న ఘటనలో భార్య ఎదుటే అడ్వకేట్ను అవమానపరిచాడనే ఆరోపణలతో సీపీ విచారణ జరిపారు. తాజాగా గాంధీ జయంతి రోజు నర్సంపేటలో జంతువధను చేస్తున్న సమయంలో కత్తితో త్వరగా కొట్టు అంటూ అనడంపై వివాదాస్పదమైంది. ఈ ఘటనపై DCP ఈస్ట్ జోన్ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది.
News October 3, 2025
సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై హెల్ప్ డెస్క్ ఏర్పాటు

సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, జీఎస్టీకి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సీటీవో ఏలూరు సర్కిల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని సిటీవో చిట్టిబాబు తెలిపారు. జీఎస్టీ వివరాలను తెలుసుకునేందుకు జిల్లా ప్రజలు సీటీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ 8096082086కు ఫోన్ చేసి వివరాలు పొందవచ్చునని తెలిపారు. నేరుగా కార్యాలయాన్ని కూడా సంప్రదించి వివరాలు పొందవచ్చన్నారు.