News October 3, 2025

తాజా న్యూస్

image

* TG: సికింద్రాబాద్-ఫలక్‌నుమా రైల్వే లైన్‌పై ROBని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. రూ.52.03 కోట్ల వ్యయంతో 360 మీటర్ల పొడవైన నాలుగు లైన్ల బ్రిడ్జి నిర్మాణం.
* AP: పల్నాడులోని సత్తెనపల్లిలో హోటల్ సిబ్బందితో ఘర్షణ.. YCP అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌పై కేసు నమోదు
* వాయుగుండం బీభత్సం.. విశాఖలో 80 ప్రాంతాల్లో కూలిన చెట్లు
* వెస్టిండీస్‌తో తొలి టెస్టు.. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు 218/3

Similar News

News October 3, 2025

విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

image

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.

News October 3, 2025

రేపే ఖాతాల్లోకి రూ.15వేలు: టీడీపీ

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపు ఆటో డ్రైవర్లకు దసరా కానుకను అందించనుందని టీడీపీ ట్వీట్ చేసింది. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకంలో భాగంగా 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సీ క్యాబ్/మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో ఉదయం 11 గంటలకు రూ.15వేల చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.435.35 కోట్లు ఖర్చు చేయనుంది.

News October 3, 2025

‘గోవిందా’ అంటే ఏంటో తెలుసా?

image

‘గోవిందా’ అంటే ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. ఇంద్రియాల ద్వారా మనస్సుకు సంతోషాన్నిచ్చే భగవంతుడే గోవిందుడు. మరో కథనం ప్రకారం.. శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి గోవులను కాపాడినందుకు, కామధేనువు పాలాభిషేకం చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు కూడా ఆయనను గోవులకు అధిపతిగా ప్రకటించి, గోవిందునిగా కీర్తించాడు. అప్పటినుంచి శ్రీనివాసుడు ఈ పవిత్ర నామంతో పూజలందుకుంటున్నాడు. <<-se>>#GovindhaNaamaalu<<>>