News October 3, 2025

సిరిమానోత్సవంలో బెస్తవారి వల ఎలా వచ్చింది..?

image

ఉత్తరాంధ్ర కల్పవల్లి <<17901808>>పైడితల్లమ్మ<<>> సిరిమాను ఘట్టం ఈనెల 7న జరగనున్న సంగతి తెలిసిందే. సిరిమాను రథం ముందు బెస్తవారి వల తిరుగుతుంటుంది. పెద్ద చెరువులో వెలసిన అమ్మవారి విగ్రహాన్ని వల సహాయంతో పలువురు మత్స్యకారులు ఏమీ ఆశించకుండానే అప్పట్లో వెలికి తీశారని చెబుతుంటారు. దీంతో అప్పటిలో రాజులు ఏటా జరిగే సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అంగీకరించారు. నేటికీ ఆ సంప్రదాయమే కొనసాగుతోంది.

Similar News

News October 3, 2025

అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సంస్థల ఆసక్తి

image

AP: మలేషియా సెలంగోర్ EX CO మెంబర్ పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, మలేషియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే CBN లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ₹10వేల కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని ప్రతినిధులందించారు. అంతకు ముందు వారు అమరావతిలో పర్యటించారు.

News October 3, 2025

మల్కాజ్గిరి: అంగన్వాడీ టీచర్ల చీరల పంపిణీ ఇంకెప్పుడు.?

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు రెండు చొప్పున చీరలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటి వరకు మేడ్చల్ జిల్లా పరిధిలోని సిబ్బందికి పంపిణీ చేయలేదు. డ్రెస్ కోడ్ సంబంధించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లుగా తెలుస్తోంది. చీరల పంపిణీ వేగవంతం చేయాలని, అంగన్వాడీ టీచర్లు కోరుతున్నారు.

News October 3, 2025

HYD: డబుల్ బెడ్ రూం పట్టాల పంపిణీ

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్‌‌పేట-134, బహుదూర్‌పురా-294, బండ్లగూడ-155, చార్మినార్-209, సైదాబాద్‌లో 206‌ మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతనం పట్టాలు పంపిణీ చేసినట్లు పొన్నం తెలిపారు.