News October 3, 2025
చంద్రముఖి, కాదంబినీ.. వీరి ప్రత్యేకత తెలుసా?

ఒకప్పుడు దేశంలో మహిళలు కట్టుబాట్ల పేరుతో ఎంతో వివక్షకు గురయ్యారు. అలాంటి కాలంలోనే పలువురు ధైర్యంగా ముందడుగు వేసి చరిత్రలో తమ పేజీని లిఖించుకున్నారు. పశ్చిమబెంగాల్కు చెందిన చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ 1882లో కలకత్తా వర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మొదటి మహిళలుగా రికార్డు సృష్టించారు. వీరు భారత స్త్రీలకు విద్యారంగంలో మార్గదర్శకులుగా నిలిచారు.
<<-se>>#FirstWomen<<>>
Similar News
News October 3, 2025
అమరావతిలో పెట్టుబడులకు మలేషియా సంస్థల ఆసక్తి

AP: మలేషియా సెలంగోర్ EX CO మెంబర్ పప్పారాయుడు, క్లాంగ్ ఎంపీ గణబతిరావ్, మలేషియా-ఆంధ్ర బిజినెస్ ఛాంబర్ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. అమరావతిని రెండున్నరేళ్లలో పూర్తిచేస్తామని తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే CBN లక్ష్యమని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో ₹10వేల కోట్లతో పలు ప్రాజెక్టుల ప్రతిపాదనల్ని ప్రతినిధులందించారు. అంతకు ముందు వారు అమరావతిలో పర్యటించారు.
News October 3, 2025
CSIR-IICTలో ఉద్యోగాలు

CSIR-IICT 7 సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. పోస్టును బట్టి పీహెచ్డీ, ఎంటెక్/ఎంఈ, ఎంఫిల్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.iict.res.in/CAREERS
News October 3, 2025
విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదు: మద్రాస్ HC

తమిళనాడు కరూర్ తొక్కిసలాట ఘటన దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. టీవీకే చీఫ్ విజయ్ వాహనాన్ని ఎందుకు సీజ్ చేయలేదని పోలీసులను ప్రశ్నించింది. ఘటన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఎక్కడికి వెళ్లారని, బాధితులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఘటనపై సిట్ దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. టీవీకే నేతల ముందస్తు బెయిల్ తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది.