News October 3, 2025

తిరుపతిలో బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు

image

తిరుపతిలోని విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, లింక్ బస్టాండ్ వద్ద బాంబ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటలకుపైగా బాంబ్, డాగ్ స్క్వాడ్ లు తనిఖీ చేపట్టాయి. మొత్తం రెండు బృందాలు తిరుపతిలోని అధిక రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తమిళనాడులో సినీ, రాజకీయ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఇక్కడ పోలీస్ శాఖ అధికారులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.

Similar News

News October 3, 2025

కనిగిరి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలలపాటు నిరుద్యోగ యువతీ, యువకులకు అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని 17- 45 ఏళ్లవారు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ఉషారాణి తెలిపారు. సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో రూ.లక్ష వరకు జీతాలు ఉంటాయన్నారు. వివరాలకు 8008822821 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News October 3, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి

image

భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో నాగవళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోం విపత్తుల శాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం,మన్యం జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు.ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News October 3, 2025

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. 24న సెకండియర్ స్టూడెంట్స్‌కు లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. JAN 23న ఎన్విరాన్‌మెంటల్ ఎగ్జామ్, FEB 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, 13న సమగ్ర శిక్షా పరీక్షలు జరగన్నాయి. టేబుల్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.