News October 3, 2025

శ్రీకాకుళం: 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

image

వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ 3వ నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. నదిలో ప్రస్తుతం 1,04,891 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోందని చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు హెచ్చరికలను గమనించాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే కలెక్టర్ కార్యాలయంలోని టోల్ ఫ్రీ నంబర్‌కు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కోరారు.

Similar News

News October 3, 2025

శ్రీకాకుళం: ‘నూతన డీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం’

image

జిల్లాలో నూతనంగా ఎంపికైన 534 మంది డీఎస్సీ ఉపాధ్యాయులకు శుక్రవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శిక్షణకు వెళ్లే ముందు ఎంపికైన ఉపాధ్యాయులు జాతీయ జెండాతో పాటు శాంతిని కలిగించే జెండాలను పట్టుకుని వెల్కమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఈవో రవిబాబు స్వాగత ఉపన్యాసంతో ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలన్నారు. DyDEO విజయ్ కుమార్, పలువురు ఎంఈఓలు పాల్గొన్నారు.

News October 3, 2025

కలెక్టర్లతో CM వీడియో కాన్ఫ్‌రెన్స్

image

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగావళి, వంశధార వంటి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని సీఎం చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..ఇక్కడున్న నదుల వలన ఎటువంటి ఇబ్బందిలేదని, గొట్టబ్యారేజ్ కి 1.4 లక్షల నీరు చేరిందని వివరించారు. JC ఇతర అధికారులు ఉన్నారు.

News October 3, 2025

SKLM: ఇద్దరు మృతి.. రూ.8 లక్షల పరిహారం

image

భారీ వర్షాలకు మందస మండలం టుబ్బూరులో మట్టి గోడ కూలి భార్యాభర్తలు సవర బుడియా, రూపమ్మ <<17900358>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. సీఎం చంద్రబాబుకు జరిగిన విషయాన్ని చెప్పారు. ఆయన ఆదేశాల మేరకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షల చొప్పున రూ.8 లక్షల పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు త్వరలో చెక్కులు అందజేయనున్నారు.