News October 3, 2025

చినరావూరులో తీవ్ర విషాదం

image

నల్గొండ (D) దేవరపల్లి దిండి కాలువలో గురువారం ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో తెనాలి చినరావూరుకు చెందిన కేతావత్ రాము నాయక్ (34) కూడా ఉండటంతో స్థానికంగా విషాదం నెలకొంది. దసరా పండుగకు బంధువులతో కలిసి అక్కడకు వెళ్లిన రాము కాలువలో పడిన మేనల్లుడు సాయి ఉమాకాంత్ ను రక్షించే క్రమంలో మృతి చెందాడు. సాయంత్రానికి రాము మృతదేహం తెనాలి రానుంది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News October 3, 2025

GNT: 13,193 మంది ఆటో డ్రైవర్ల ఖాతాలో రేపే నగదు జమ

image

‘ఆటో డ్రైవర్ల సేవలో’ నూతన పథకాన్ని సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో ప్రారంభించనున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 14,755 ఆటో డ్రైవర్లు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోగా.. వీటిని పరిశీలించిన అధికారులు 13,193 అప్లికేషన్లను మంజూరు చేశారు. వివిధ కారణాలవల్ల 1562 దరఖాస్తులను తిరస్కరించారు. అర్హులకు రూ.15 వేల చొప్పున జమ చేయనున్నారు. విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నవారు అనర్హులుగా ఉన్నారు.

News October 3, 2025

సీఎం చేతుల మీదుగా ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ప్రారంభం

image

సీఎం చంద్రబాబు శనివారం ‘ఆటో డ్రైవర్ సేవలో’ అనే నూతన పథకాన్ని ప్రారంభించనున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉదయం 9:30 గంటలకు ఆయన స్వయంగా ఆటో ఎక్కి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ సహా పలువురు మంత్రులు హాజరవుతారని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 3, 2025

భవిష్యత్ అవసరాలు ముందే గుర్తించాలి: కలెక్టర్

image

వ్యవసాయం, వాటి అనుబంధ రంగాల్లో పెట్టుబడి తగ్గి రైతులకు లాభం పెరగాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రాథమిక రంగాల శాఖలతో శుక్రవారం కలెక్టర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని, ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలన్నారు.